కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పెద్ద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఇకపై హిందూ మతంలో భాగం కాదని ఆయన అన్నారు. అతన్ని హిందూ మతం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు. బద్రీనాథ్లోని శంకరాచార్య ఆశ్రమంలో స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ..
గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్లో సీసీ టీవీ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్లోని బాత్రూం వద్ద సీసీ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాత్రి వేళల్లో హాస్టల్ కి బయట వ్యక్తులు వస్తున్నారని పేర్కొన్నారు.
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి మద్ధతుగా నిలుస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందని వ్యాఖ్యానించారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే బ్యాటర్ల మైదానం అని చెప్పవచ్చు. ప్రతి సీజన్లోనూ కొత్త కొత్త రికార్డులు నమోదవుతుంటే, కొన్ని గత రికార్డులను తిరగరాస్తుంటాయి. ఇందులో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న అంశాల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు సాధించడం ఒకటి. ఐపీఎల్ చరిత్రలో కొన్ని ఇన్నింగ్స్లు అభిమానుల మనసుల్లో నిలిచిపోయేలా మారాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా అంతే.. ఈ మ్యాచ్లో రొమారియో షెపర్డ్ ఊచకోత కోశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బరిలోకి దిగిన ఆర్సీబీ అయిదు వికెట్ల నష్టానికి 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కింగ్ కోహ్లీ తుఫాను చెన్నై బౌలర్లకు చుక్కలు చూయించాడు. బెతెల్ అర్ధ శతకంతో అదరగొట్టాడు.
ఒకప్పుడు కంటికి సంబంధించిన సమస్యలు మధ్య వయస్సు దాటితే కాని కనిపించేవి కాదు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. స్కూలుకెళ్లే పిల్లలు కూడా కళ్లజోళ్లతో కనిపిస్తున్నారు. ఇందుకు కారణం మయోపియా అని డాక్టర్లు చెబుతున్నారు. అంటే హ్రస్వదృష్టి. ఇలాంటి కండిషన్ ఉన్నవారిలో కనుగుడ్డు ఉండాల్సిన దానికంటే పొడవుగా ఉంటుంది. దాంతో సరిగ్గా రెటీనా మీద కేంద్రీకృతం (ఫోకస్) కావాల్సిన కాంతికిరణాలు... రెటీనాకు కాస్త ముందే కేంద్రీకృతమవుతాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగుళూరు వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ ఛాన్స్ కోల్పోయిన చెన్నై.. పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానానికి చేరుకుంది. 10 మ్యాచులు ఆడి కేవలం 2 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నై, ఆర్సీబీ కలిసి ఆడే చివరి మ్యాచ్ ఇది.. 10 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 7 మ్యాచుల్లో గెలిచింది. టేబుల్ లో మూడో స్థానాన్ని…
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమేణా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఈవీలపై గట్టిగానే దృష్టి పెడుతున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్లతోపాటు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం సైతం పుంజుకుంటోంది. అందుకే టాటా, మహీంద్రా వంటి దేశీయ సంస్థలతోపాటు హ్యుందాయ్, కియా, ఎంజీ తదితర విదేశీ కంపెనీలూ భారతీయ మార్కెట్కు తమ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తున్నాయి.
గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఈ ఐపీఎల్ సీజన్లో దుమ్మురేపుతున్నాడు. తన భారీ ఇన్నింగ్స్ల కారణంగా గుజరాత్ ఈ రోజు టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా సాయి సుదర్శన్ సన్ రైజర్స్ పై ఊచకోత కోశాడు. 23 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో శతకొట్టాడు. ఈ భారీ ఇన్నింగ్స్ కారణంగా సాయి సుదర్శన్ చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేడుకున్నాడు.
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. మీలో ప్రతిభ ఉంటే.. ఎవ్వరూ ఆపలేరని నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్కి చెందిన సూర్యవంశీ ఇటీవల గుజరాత్ టైటాన్స్పై గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా ఈ క్రీడారుడిని కాపాడుకోవాలంటూ.. క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి హెచ్చరించారు. ఛాపెల్ గతంలో టీం ఇండియా కోచ్గా కూడా పనిచేశారు. సూర్యవంశీ రాణించాలంటే సచిన్ టెండూల్కర్ లాంటి మద్దతు అవసరమని ఆయన అన్నారు.