Sudharshan Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరు గ్యారంటీల అమలు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు కీలకమైన భాధ్యత లభించడం, పార్టీ అంతర్గత రాజకీయాల్లో సమతుల్యత సాధించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి పదవి ఆశించిన మరో సీనియర్ నేత ప్రేమ్ సాగర్…
Kavitha: కరీంనగర్ జిల్లాలో కవిత మొదటి రోజు పర్యటన కొనసాగుతోంది. మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మొంథా తుపాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయటం లేదు. దానికి తోడు వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు.
Mohammed Azharuddin: మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి వరించింది. నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నూతన మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఏ శాఖను కేటాయిస్తారు అనే అంశంపై క్లారిటీ లేదు.
Mamta Kulkarni: బాలీవుడ్ మాజీ నటి, ప్రస్తుతం సన్యాసినిగా జీవిస్తున్న మమతా కులకర్ణి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోరఖ్పూర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం చెలరేగింది. తన మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో మమతా మాట్లాడుతూ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబై పేలుళ్లకు పాల్పడలేదని, అతడు ఉగ్రవాది కాదన్నారు.
Venkaiah Naidu: పటేల్ 150 జయంతి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సర్దార్ ఒక ఉక్కుమనిషి.. పటేల్ దేశ సమైక్యత శిల్పి అని కొనియాడారు. ఆయన సంస్కరణలు దేశానికి ఆదర్శం.. దేశానికి మొదటి ప్రధాని కావాల్సిన వారని గుర్తు చేశారు. దేశంలో ఉన్న 15 రాష్ట్రాల్లో నాడు 14 రాష్ట్రాలు పటేల్ ప్రధాని కావాలని కోరాయని తెలిపారు. గాంధీ కోరిక మేరకు ప్రధాని పదవిని వదులుకున్న త్యాగశీలి పటేల్ అని చెప్పారు.…
Union Minister Kishan Reddy: ఏడాది పాటుగా పటేల్ ఉత్సవాలు జరుపుతామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. పటేల్ రాజకీయ నేత కాదు రైతాంగ ఉద్యమ నేత అని కొనియాడారు. తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పటేల్ అంటే కాంగ్రెస్ పార్టికి నొప్పి.. పీవీ నరసింహారావు అంటే కాంగ్రెస్ కు నచ్చదన్నారు. కేవలం నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్ నచ్చుతుందని విమర్శించారు.కాంగ్రెస్ కు దేశమంటే నెహ్రూ, నెహ్రూ అంటే దేశం.. నెహ్రూ తప్ప కాంగ్రెస్ కు…
DGP Shivadhar Reddy: 2016లో భరోసా సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.. ఈరోజు శంషాబాద్ లో 33వ భరోసా సెంటర్ ప్రారంభం జరిగిందని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు.. మహిళలు, పిల్లలపై హింసలు జరిగితే వారికి న్యాయం చేయడానికి భరోసా సెంటర్ లు ఉన్నాయన్నారు.. తాజాగా శంషాబాద్లో భారోసా సెంటర్ను ప్రారంభించిన డీజీపీ.. ఈ సందర్భంగా ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాలు, 6 కమిషనరేట్ లలో భరోసా సెంటర్ లు ఉన్నాయని తెలిపారు.. భరోసా సెంటర్ ల నిర్వహణ, మానిటరింగ్ మొత్తం విమెన్ సేఫ్టీ…
CP Sajjanar: సర్దార్ వల్లభాయ్ పటేల్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంచి సమాజ నిర్మాణం కోసం యువత పాటు పడాలన్నారు. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ ఐక్యత దినోత్సవం) జాతీయ ఐక్యత కోసం 5K RUN కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫెక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని స్పష్టం చేశారు. డీప్ ఫెక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్ పెట్టామన్నారు.. సైబర్ నేరాల పట్ల ఆందోళనకు గురికావద్దని…
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ తన భార్య ఉషా వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య ఉష ఏదో ఒక రోజు తనలాగే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్లో హత్యకు గురైన రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ జ్ఞాపకార్థం బుధవారం రాత్రి మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో జె.డి. వాన్స్ మాట్లాడారు. పరస్పర గౌరవం, అవగాహనతో మతాంతర వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తికరంగా, గతంలో దేవుడిని నమ్మని వాన్స్ క్రమంగా తన భార్య సహాయంతో…
Samineni Ramarao murder: మధిర శాసనసభ నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కలుషిత హింస రాజకీయాలకు తావు లేదు అని డిప్యూటీ సీఎం అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ఖమ్మం పోలీసు అధికారులను హెచ్చరించారు. క్లూస్ టీం, శ్రీ ఫర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి…