Kothuru Ram Kumar
Author- NTV Telugu-
2024 Election Results: జోరు తగ్గిన బీజీపీ.. కానీ అధికారం దిశగా..
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా మరోసారి ఆధిక్యం చాటుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 290 + స్థానాల్లో ముందంజలో ఉంది. ఇకపోతే గడిచిన 2019 ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించగా.. అప్పటి ఎన్నికలతో పోల్చితే బీజేపీ 57 స్థానాలు తక్కువగా నెంబర్ తో కొనసాగుతుంది. ఇక మరోవైపు చెప్పుకోవాలిసినది కాంగ్రెస్ ఘననీయంగా పుంజుకుంది. దేశవ్యపథంగా వివిధ పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలలో ఇప్పటి వరకు 100 స్థానాల […] -
ladies Missing In Beach: బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా., ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక విషమంగా ఉన్న మహిళను మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు. నేడు ఆదివారం కావడంతో సరదాగా బీచ్ కు వెళ్లినవారికి ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులలో తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. ఇక బీచ్ లో వారు సరదాగా సెల్ఫీ తీస్తుండగా కాలు జారిపడి సముద్రంలో […] -
NHAI: నేటి అర్ధరాత్రి నుండి బాదుడే.. టోల్ ఛార్జిలను 5% పెంపు..
పెరిగిన టోల్ ఛార్జీలు ఈ రోజు (జూన్ 3) అర్ధరాత్రి నుండి మార్చి 31, 2025 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHIA) ఉత్తర్వులను జారీ చేసింది. ఈ అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా టోల్లు పెరగనున్నాయి. టోల్లు సగటున 5 శాతం పెరుగుతాయని NHIA తెలిపింది. కొద్ది రోజుల క్రితమే ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నా.. ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. అయితే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి […] -
Gam Gam Ganesha: దూసుకెళ్తున్న ‘గం గం గణేశ’.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఇలా..
ఆనంద్ దేవరకొండ నటించిన ”గం గం గణేశ” సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చింది., అయితే మొదటి రోజు పోటిలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్స్ ని రాబట్టింది. ఈ చిత్రం రెండవ రోజు బాక్సాఫీస్ వద్ద డ్రాప్స్ కనిపించినా కూడా చివర్లో, మొదటి రోజు అత్యధిక టిక్కెట్లు సాధించిన సినిమాలు రెండో రోజు బాగానే ముగించి ఓవరాల్గా విజయాన్ని కొనసాగించడం గమనార్హం. మొదటి రోజు బాక్సాఫీస్ 60 లక్షల లోపు షేర్ వసూలు […] -
Fire Accident: అగ్నిప్రమాదంలో 30కి పైగా కార్లు దగ్ధం..
నోయిడాలోని సెక్టార్-8 ప్రాంతంలో ఆదివారం ఒక ప్లాట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు 35 కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. స్కోడా స్క్రాప్ చేసిన కార్లను ఖాళీ స్థలంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇక అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.., మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటల గురించి కాల్ వచ్చిందని., తాము వెంటనే ఫైర్ ఇంజెన్స్ తో అక్కడికి చేరుకుంట్లు తెలిపారు. Iceland: ఐస్లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ‘హల్లా టోమస్డోత్తిర్’.. […] -
Iceland: ఐస్లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ‘హల్లా టోమస్డోత్తిర్’..
బి టీమ్ కంపెనీ సీఈఓ, వ్యాపారవేత్త అయిన హల్లా టోమస్డోత్తిర్ ఐస్లాండ్ యొక్క ఏడవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇక ఈమె ఆగస్టు 1న గ్వానా జోహన్నెసన్ నుండి బాధ్యతలు స్వీకరించనున్నారని అక్కడి మీడియా నివేదించింది. 1980లో ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షురాలిగా ఎన్నికైన ప్రపంచంలోనే తొలి మహిళగా గుర్తింపు పొందిన విగ్డిస్ ఫిన్బోగాడోత్తిర్ తర్వాత ఆ పదవిని చేపట్టిన రెండో మహిళ టోమస్డోత్తిర్ గా రికార్డ్ సృష్టించింది. Afghanistan: నదిని దాటుతుండగా పడవ బోల్తా.. 20 మంది దుర్మరణం.. ఇందుకు […] -
Afghanistan: నదిని దాటుతుండగా పడవ బోల్తా.. 20 మంది దుర్మరణం..
తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో పెను విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నది దాటుతుండగా బోటు బోల్తా పడడంతో 20 మంది మృతి చెందారు. ఘటన సంబంధిత వివరాల్లోకెళితే.. మహ్మంద్ దార్ ప్రాంతంలో నది దాటుతుండగా ఓ బోటు బోల్తా పడింది. ప్రమాదంలో పడవలోని వారందరూ మునిగిపోయారని నంగరార్ ప్రావిన్స్కు చెందిన ప్రాంతీయ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. Cyber Crime: 9 కోట్లు […] -
Cyber Crime: 9 కోట్లు మోసపోయిన వ్యాపారవేత్త.. వివరాలు ఇలా..
తాజాగా నోయిడాకు చెందిన 41 ఏళ్ల వ్యాపారవేత్త 9 కోట్ల రూపాయల మేర సైబర్ వలలో మోసపోయారు. సైబర్ మోసంలో చిక్కుకున్న ఆయన ఏకంగా 9.09 కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు. నోయిడాలోని సెక్టర్ 40 కి చెందిన రజిత్ బోత్ర ఏప్రిల్ 28న ఓ లాభదాయమైన షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ చిట్కాలను అందించే వాట్సప్ గ్రూపులో చేరడం జరిగింది. అలా చేరిన నెల రోజుల లోపల ఈ రేంజ్ లో అతను మోసపోయాడు. Committee Kurrollu: ‘ఆ […] -
Committee Kurrollu: ‘ఆ రోజులు మళ్లీ రావు’ అంటున్న ‘కమిటీ కుర్రోళ్లు’..
శ్రీ రాధ దామోదర్ స్టూడియో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ల పై నిహారిక కొణిదెల సమర్పణలో వస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ చిత్రాన్ని పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మించారు. అలాగే సినిమాకి ఎద వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మలు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాట, పోస్టర్లు అందరినీ ఆకట్టుకునెల ఉన్నాయి. AC usage: ఎక్కువ సమయం […] -
Paruvu: దొరికిపోవాలి లేదా పారిపోవాలి.. క్రైమ్ థ్రిల్లర్గా రాబోతున్న ‘పరువు’.. ట్రైలర్ రిలీజ్..
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీసులతో జరిగిన గొడవ సంబంధించిన ఓ వీడియో కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇందులోని అసలైన రహస్యం తెలిసింది. ఇదంతా తన కొత్త సినిమాకు పబ్లిసిటీ స్టంట్ అనే సంగతి తెలిసిందే. నివేదా పేతురాజ్ తాజా వెబ్ సిరీస్ ‘పరువు’. ఈ సినిమా ప్రమోషన్లో నివేదా ఇలా ప్రవర్తించిందని మేకర్స్ స్పష్టం చేశారు. మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రీమియర్ తేదీ, ఫస్ట్ లుక్ ను […]
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!