-
బెంగాల్లో మే 30వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి. తాజాగా మే 30 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను విధిస్తూ శనివారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 3 గంటలు దుకాణాలు తెరిచి ఉంచేలా […] -
మరికాసేపట్లో మాజీ డీజీపీ ప్రసాదరావు అంత్యక్రియలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు సోమవారం (మే 10) అమెరికాలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పిరావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఐదు రోజుల తర్వాత ప్రసాదరావు మృతదేహం హైదరాబాద్ కు చేరుకుంది. ప్రశాసన్ నగర్ లో ఉన్న ప్రసాద్ రావు ఇంటికి మృతదేహం చేరుకుంది. మరికాసేపట్లో అంత్యక్రియలు ఆయన […] -
కారు పార్కింగ్ గొడవ.. దారుణ హత్య
కర్నూలులో దారుణం జరిగింది. సంతోష్ నగర్లో మహేశ్వర రెడ్డిని (35) కిరాతకంగా హత్య చేయడం కలకలం రేపింది. మహేశ్వరరెడ్డి తెలంగాణలో ఎస్బీఐలో ఫీల్డ్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. ఆయనకు మరో వ్యక్తితో రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత మహేశ్వర రెడ్డిని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. హత్య వెనుక రియల్ ఎస్టేట్ వివాదాలు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు […] -
ఆగని ‘ఇండియన్ 2’ వివాదం.. ఫిల్మ్ఛాంబర్స్కు లేఖ!
స్టార్ దర్శకుడు శంకర్ సినిమాల్లో ఇంతవరకు చూడని ఎన్నో వివాదాలు ‘ఇండియన్ 2’ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి. రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన సంచలన చిత్రం ‘ఇండియన్’ కు ఇప్పుడు దర్శకుడు శంకర్ సీక్వెల్ రూపొందిస్తున్న సంగతి విదితమే. కమలహాసన్, కాజల్ జంటగా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ కూడా జరిగింది. ఆ తరువాత వరుస వివాదాలతో ఈ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణను […] -
హన్సిక సినిమాపై కేసు.. డైరెక్టర్ లేకుండా ఆ పని చేశారట
దేశముదురు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హన్సిక.. ఆ తరువాత అవకాశాలు బాగానే వచ్చిన హిట్ సినిమాలు అందుకోవడంలో కాస్త వెనుకబడిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ సినిమాలో బిజీగా హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం హన్సిక మాజీ ప్రేమికుడు శింబుతో కలిసి ‘మహా‘ సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో ఈ చిత్ర దర్శకుడు జమీల్ కేసు వేశాడు. సినిమాలో కొంత భాగాన్ని తనకు తెలియకుండా అసిస్టెంట్ […] -
ఒకే కుటుంబంలో ముగ్గురికి టైఫాయిడ్.. కరోనా అనుకుని ఆత్మహత్య
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కంటే ఎక్కువగా కరోనా ఆలోచనలు జనాల్ని వెంటాడుతున్నాయి. దీనితో మరింత అనారోగ్యపాలవుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలు కేసు చేసుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా (62) రెండు సంవత్సరాలుగా విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గుప్తాకు భార్య […] -
మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని హీరో!
సూపర్ స్టార్ మహేష్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా మే 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్రంలో అక్కినేని హీరో సుమంత్ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ […] -
సరిహద్దుల్లో అంబులెన్సులను పట్టించుకోని ప్రభుత్వం.. అరెస్టులా?: పవన్
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి […] -
రఘురామకృష్ణరాజు కేసు: అరెస్ట్ ను ఖండించిన పురందేశ్వరి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే పార్టీలకు అతీతంగా రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను తప్పుబడుతున్నారు. తాజాగా బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఎంపీ రఘురామకృష్ణరాజు ను అరెస్టును ఖండించారు. ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను […] -
మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న లిక్కర్ దాడులు
మంచిర్యాల జిల్లాలో మద్యం షాపులపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల బెల్లంపల్లిలోని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, రీసెంట్ గా జిల్లాలోని ఇందారం గ్రామంలో కల్తీ మద్యం దందాని నడిపిస్తున్న లక్ష్మీగణపతి వైన్స్ ను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. తాజాగా ఇందారం సమీప గ్రామంలోని రామారావుపేట్ లో అక్రమ మద్యం అమ్మకాలు చేస్తున్న దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించారు. జైపూర్ ఎస్సై రామకృష్ణ వారి సిబ్బందితో కలిసి.. ఎలాంటి అనుమతులు లేకుండా వైన్ […]
తాజావార్తలు
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!