NTV WebDesk
Author- NTV Telugu-
ఈ నెల 20 తరువాత రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేస్తారా? సడలింపులు పెంచుతారా?
ఈనెల 19 వ తేదీతో రాష్ట్రంలో లాక్డౌన్ సమయం ముగియనున్నది. జూన్ 9 నుంచి పది రోజులపాటు లాక్డౌన్ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే, జూన్ 20 నుంచి లాక్డౌన్ ను పొడిగిస్తారా లేదంటే పూర్తిగా ఎత్తివేస్తారా అనే దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రుల నుంచి, ఆరోగ్యశాఖ నుంచి ముఖ్యమంత్రి ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కరోనా […] -
విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ కీలక సమావేశం…దానిపైనే సమీక్ష…
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పెంచుతున్నారు. దీంతో కరోనా మరణాల సంఖ్య సైతం దేశవ్యాప్తంగా తగ్గుతున్న తరుణంలో గతేడాది విద్యాసంవత్సరానికి సంబందించి పరీక్షలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఈరోజు ముఖ్యమంతి వైఎస్ జగన్ విద్యాశాఖాదికారులతో సమీక్షను నిర్వహించబోతున్నారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షల తేదీలపై ఈరోజు అధికారులతో సమీక్షను నిర్వహిస్తారు. తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ఎయిమ్స్లో అగ్నిప్రమాదం…
దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఎయిమ్స్లోని తొమ్మిదవ అంతస్తులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 22 ఫైర్ టెండర్స్ తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తొమ్మిదవ అంతస్తులో డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, పరీక్షా విభాగాలు ఉన్నాయని, కొవిడ్ 19 నమూనాలను సేకరించిన ప్రాంతంలో మంటలు చెలరేగినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. -
లక్షణాలు కనిపించని రోగుల్లో కరోనా ఎంతకాలం ఉంటుంది?
కరోనా ముప్పునుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. క్రమంగా సాధారణ జీవనం ప్రారంభం అవుతున్నది. చాలా మందికి కరోనా పాజిటీవ్ వచ్చినప్పటికీ, లక్షణాలు కనిపించకపోవడంతో వారిలో కరోనా ఎంతకాలం ఉంటుంది అనే దానిపై అమెరికాకు చెందిన ఫెయిర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఓ పరిశోధన నిర్వహించింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన వారి వివరాలను సేకరించి పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. కరోనా పాజిటీవ్గా నిర్ధారణ జరిగి, లక్షణాలు కనిపించని వారిలో […] -
గాజాపై ఇజ్రాయిల్ మళ్లీ దాడి…
నెల రోజుల క్రతం ఈజిప్ట్, అమెరికా చొరవతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే, కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. గాజా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారని అనుకున్నారు. కానీ, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన మూడోరోజే గాజాపై ఇజ్రాయల్ బాంబుల వర్షం కురిపించింది. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో దాడులు చేసింది. అయితే, ఈ దాడుల్లో ఎంతమంది మరణించారు అనే విషయాన్ని బయటపెట్టలేదు. ప్రమాదకరమైన వాయువులు కలిగిన బెలూన్లను […] -
గంగానదిలో కొట్టుకొచ్చిన పెట్టె…తెరిచి చూస్తే…
గంగానదిలో ఓ పెట్టె కొట్టుకు వచ్చింది. దానిని తెరిచి చూసి పడవనడిపే వ్యక్తి షాక్ అయ్యాడు. ఆందులో 21 రోజుల వయసున్న చిన్నారి, పక్కన కాళీమాత అమ్మవారి ఫొటో ఉన్నది. ఫొటో పక్కన చిన్నారి జాతకం, గంగ అనే పేరు ఉన్నది. గంగా మాత ప్రసాదించిన చిన్నారిగా భావించిన ఆ వ్యక్తి పెంచుకుందామని ఇంటికి తీసుకుపోయాడు. అయితే, విషయం అధికారులకు తెలియడంతో హుటాహుటిన పడవ నడిపే వ్యక్తి ఇంటికి వచ్చి చిన్నారిని పెంచుకోవడానికి కుదరదని, విచారణ జరపాలని […] -
టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ సమన్లు…
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 25 వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడి సమన్లలో పేర్కొన్నది. బ్యాంకు రుణాలను వేరే సంస్థలకు మల్లించిన కేసులో నామా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే ఈడీ ఇటీవలే నామా ఇంటిపైన, కార్యాలయాలపైన దాడులు చేశారు. రెండు రోజులపాటు మధుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదును ఈడీ స్వాదీనం చేసుకున్నది. స్వాదీనం […] -
బంగారు గొలుసును మింగేసి యజమానికి షాకిచ్చిన శునకం…
కాపలాగా ఉండాల్సిన ఓ శునకం యజమానికి తిప్పలు తెచ్చిపెట్టింది. యజమానే శునకానికి కాపలాగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాలోని కారటిగి పట్టణానికి చెందిన దిలీప్ అనే వ్యక్తి ఇంటికి కాపలాగా ఉంటుందని చెప్పి 5వేలు పెట్టి ఓ శునకాన్ని తెచ్చుకున్నాడు. అయితే, ఆ శునకం ఏకంగా యజమాని బంగారం గొలుసును మింగేసింది. గొలుసు కనిపించకపోవడంతో దిలీప్ ఇళ్లంతా వెతికాడు. చివరకు కుక్కను కట్టేసిన ప్రాంతంలో చిన్నచిన్న బంగారం ముక్కలు కనిపించడంతో షాక్ అయ్యాడు. తరువాత […] -
ఇండియాలో మరో ఫంగస్..ఊపిరితిత్తులపై దాడి…
ఇండియాలో కరోనా మహమ్మారి ఒకవైవు ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు ట్రీట్మెంట్ తరువాత తలెత్తున్న ఇన్ఫెక్షన్లు ఆంధోళన కలిగిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్తో పాటుగా వైట్, యెల్లో, రోజ్ కలర్ ఫంగస్ కేసులు కూడా ఇటీవల నమోదయ్యాయి. ఈయితే, ఇండియాలో ఇప్పుడు మరో ఫంగస్ బయటపడింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో నివశిస్తున్న ఓ వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాక ఫంగస్ ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరాడు. అరబిందో […] -
ట్విట్టర్పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన కేంద్రం…
ట్విట్టర్ పై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్దం అవుతున్నది. చాలా రోజుల క్రితం ట్విట్టర్ కు భారతప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ ప్యానల్ సమన్లు జారీ చేసిన తరువాత ట్విట్టర్ తాత్కలిక ఛీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించింది. ఇచ్చిన గడువు లోపల ట్విట్టర్ చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించలేదని కేంద్రం పేర్కొన్నది. ట్విట్టర్పై చర్యలు తీసుకునేందుకు సిద్దమయింది. అధికారిని ఆలస్యంగా నియమించడంతో భారత్లో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్టు కేంద్రం తెలియజేసింది. చట్టపరమైన రక్షణను కోల్పోవడంతో ట్వట్టర్పై […]
తాజావార్తలు
-
Zomato: ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!