మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) మరియు ఇతర సెక్షన్ల కింద "న్యూస్క్లిక్" వ్యవస్థాపకుడు మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్తతో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
పెడన పోలీసు స్టేషన్ పరిధిలో తోటమూల సెంటరులో జనసేన బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేశారు అని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. తన సభలో దాడులు జరుగుతాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.. అక్కడ పూర్తి విచారణ, పరిశీలన చేశాం.. పవన్ కేడర్ కు ఇచ్చిన సందేశం పైన పూర్తి పరిశీలన చేశాం.. పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని ఆయనకు నోటీసు ఇచ్చామని ఎస్పీ పేర్కొన్నారు.
Telangana Teachers: రాష్ట్రంలోని రెండు మల్టీజోన్లలో పదోన్నతులు కాకుండా బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి మంగళవారం బదిలీల షెడ్యూల్ విడుదలైంది.
రోజు రోజుకి ట్రంప్ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా మంగళవారం ట్రంప్ సివిల్ వ్యాపారం పైన న్యూయార్క్ న్యాయమూర్తి నిషేధాజ్ఞలు జారీ చేశారు.
రాజ్యంగంపై విశ్వాసం లేని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తున్నది అని ఆయన ఆరోపించారు. ఆంద్ర రాష్ట్రం ఇండియాలో భాగం కాదని బీజేపీ విశ్వసిస్తుంది.. అందుకే పార్లమెంటులో పాసైన చట్టాలను అమలు పరచడం లేదు.. తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ లు ఫెయిల్ అయ్యారు అని గిడుగు రుద్రరాజు అన్నారు.
ప్రధాని మోడీ గతంలో పార్టీ నేతల మాదిరిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లెక్కలు బయటపెట్టే ధైర్యం ఎవరికీ లేదు. ఈ రోజు రాహుల్ గాంధీ దీని గురించి గళం విప్పారు.
చిన్న తనంలోనే ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు.. ప్రజాహితం కోసం అభివృద్ధి కోసమే రాజకీయాలు చేస్తా నా స్వార్ధం కోసం చేయను.. మంత్రిగా ఉండి పాలేరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తీర్చే అవకాశం శ్రీరామచంద్రుడు నాకు కల్పించారు అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీకి వెళ్లారు. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.