Nara Lokesh: రాయలసీమ బిడ్డనంటూ క్యానర్ గడ్డలా పీడిస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన పాపాలు రాయలసీమకి శాపాలుగా మారుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జగన్ చేసిన నేరాలు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఉరివేస్తున్నాయి.. అక్రమాస్తుల కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నాడు అని ఆయన విమర్శించారు. రుషికొండ గుండు కొట్టిన కేసు తప్పించుకునేందుకు విశాఖ రైల్వే జోన్ కి నీళ్లొదిలాడు అంటూ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Health Tips : బచ్చలి కూరను ఎక్కువగా తింటున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సిందే..
Also Read
- Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్కు లైన్క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం
- Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్లో వైద్య నిపుణుల కీలక సూచనలు..
- Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..
- Babar Azam: పాక్ క్రికెట్లో కొత్త శకం.. బాబర్ అజామ్ ఔట్..
బాబాయ్ ని చంపించేసిన కేసులో తమ్ముడిని రక్షించుకునేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుని ప్రశ్నార్థకం చేశాడు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాయలసీమ బిడ్డనంటూ క్యాన్సర్ గడ్డలా పీడిస్తున్నాడు అని ఆయన మండిపడ్డాడు. జగన్ సర్కారు దారుణ వైఫల్యం వల్లే కృష్ణాజలాల కేటాయింపులు పునఃసమీక్ష జరుగుతోంది అని విమర్శించారు. ప్రజలారా జగన్ కి ఇచ్చిన ఒక్క అవకాశంతో ఏమేమి కోల్పోయారో గుర్తించండి.. రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలు తీర్చే కృష్ణాజలాలలో న్యాయబద్దమైన వాటా కోల్పోతే, రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉంది అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది.. చంద్రబాబును అరెస్ట్ చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని నారా లోకేశ్ తెలిపారు.
తాజావార్తలు
-
Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్కు లైన్క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం
-
DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!
-
Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్లో వైద్య నిపుణుల కీలక సూచనలు..
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..
-
Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!