‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది, ఆగస్టు 11–17, 2025 వారానికి గానూ ఓర్మాక్స్ మీడియా ఓ సర్వేని వెల్లడించింది. భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన స్ట్రీమింగ్ షోల జాబితాలో ‘మయసభ’ 3వ స్థానంలో ఉందని ఓర్మాక్స్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్ 2.8 మిలియన్ల వీక్షణలతో పాన్-ఇండియా వైడ్గా సంచలనం సృష్టించింది. భాషా సరిహద్దుల్ని చెరిపేస్తూ అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని ‘మయసభ’ మెప్పిస్తోంది. Also Read : Suhas: తమిళ్లో జెండా పాతేట్టున్నాడే! […]
ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్గా ‘మండాడి’ హై-ఆక్టేన్ మూవీగా రాబోతోన్న సంగతి తెలిసిందే. ‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూరి, సుహాస్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఒక ల్యాండ్మార్క్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. శక్తివంతమైన ప్రదర్శనలు, గొప్ప విజువల్స్, భావోద్వేగభరితమైన కథనంతో ‘మండాడి’ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. Also Read:NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ క్యాన్సిల్? తెలుగు యంగ్ […]
ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సమంత ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. 2010లో ‘ఏ మాయ చేశావే’తో సినీ రంగంలోకి వచ్చిన ఆమె, ‘ఈగ’, ‘తేరి’, ‘మజిలీ’, ‘మేర్సల్’ లాంటి హిట్ సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్తో ఆమె దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. సమంత రూత్ ప్రభు ఆర్మాక్స్ మీడియా జూలై 2025 ర్యాంకింగ్లో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్గా సమంత టాప్ స్థానంలో నిలిచింది. […]
తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధర్మ మహేష్ కాకాని అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. మహేష్, అతని కుటుంబం మీద మహేష్ భార్య వరకట్నం కేసు ఫైల్ చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. నిజానికి గతంలో కూడా అదనపు కట్నం కేసులో ధర్మ మహేష్ కొన్ని రోజులపాటు కౌన్సెలింగ్కి కూడా వెళ్లొచ్చారు. […]
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేకపోయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఎలా చూస్తున్నారంటూ తెలుగుదేశం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినట్లుగా ఉన్న ఒక ఆడియో వైరల్ అయింది. అది తన ఆడియో కాదని, ఎవరో కావాలని కుట్ర చేసి తన ఆడియోగా సృష్టించారని ఇప్పటికే ఆయన ఒక వీడియో రిలీజ్ […]
సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్గా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా రానున్న చిత్రం ‘లవ్ యూ రా’. ఈ మూవీకి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్ను సోమవారం (ఆగస్ట్ 18) నాడు నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, […]
మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్దను కాదని, తాను కూడా సినీ పరిశ్రమలో ఒకడినేనని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే, సినీ పరిశ్రమలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళుతుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమలో వేతనాలు పెంచాలని ఫెడరేషన్ మొదలుపెట్టిన సమ్మె మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. సుమారు రెండు వారాల నుంచి కొనసాగుతున్న సమ్మెకు ఒక బ్రేక్ వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. […]
ప్రపంచవ్యాప్తంగా యానిమేకు ఒక బెంచ్ మార్క్ అయిన క్రంచిరోల్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్” తమిళ, తెలుగు ట్రైలర్లను రిలీజ్ చేసింది. ఈ ఎపిక్ ట్రైలజీ యొక్క ఫస్ట్ పార్ట్ ని భారతదేశంలో 2025 సెప్టెంబర్ 12న ప్రత్యేకంగా థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది. ఇందులో IMAX, ఇంకా ప్రీమియం లార్జ్ ఫార్మాట్లలో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా జపనీస్లో ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో పాటు, ఇంగ్లీష్, […]
సూపర్ స్టార్ రజనీకాంత్కి ఒక అరుదైన రికార్డు ఉంది. ఇప్పటివరకు మరే హీరో ఆ రికార్డు బద్దలు కొట్టలేకపోయారంటే, ఆయన నిబద్ధత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ రికార్డు ఏంటంటే, ఇప్పటివరకు ఏ ఒక్క కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లోనూ నటించని ఏకైక స్టార్ హీరోగా రజనీకాంత్ ఘనత అందుకున్నారు. ఏ కంపెనీ వారైనా ఎన్ని కోట్లు ఇస్తామన్నా సరే, “నేను ఏ యాడ్ చేసినా నా అభిమానులు నన్ను ఫాలో అయ్యే వారు గుడ్డిగా. మాస్టారు, ఆ తర్వాత […]
ముదావత్ మురళి నాయక్ భారత సైనిక దళానికి చెందిన జవాన్ తెలుగు బిడ్డ. ఆయన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025 లో పాల్గొన్నాడు. పాక్-ఆక్రమిత కాశ్మీరులో శత్రువులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు. ఇప్పుడు ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై గౌతమ్ కృష్ణ కథానాయకుడిగా కే సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమాని […]