శుక్రవారం నాడు ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ జకీయా ఖానమ్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తొలిసారిగా మైనారిటీ మహిళకు మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ పదవి దక్కనుంది.
Read Also: అమెజాన్లో అమ్మకానికి ‘విషం’… ఎఫ్ఐఆర్ నమోదు
ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి మాట్లాడారు. జకీయా ఖానమ్కు మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ పదవి ఇవ్వడం హర్షదాయకమన్నారు. ఒక మైనారిటీ మహిళను ఎంపిక చేయడం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం ద్వారా మైనారిటీలపై సీఎం జగన్కు ఉన్న ప్రేమ మరోసారి స్పష్టమైందని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. కాగా ఇటీవల ఏపీ శాసన మండలి ఛైర్మన్గా మోషేన్ రాజు బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.