YV Subbareddy: జూన్ నెలాఖరుకి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు పూర్తవుతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YV Subbareddy Talks About Srinivasa Sethu Flyover: టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను చైర్మన వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అలిపిరి వద్ద చిన్నపిల్లల పీడియాట్రిక్ ఆసుపత్రి, అలిపిరి చెక్ పాయింట్, శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జూన్ నెలాఖరు నాటికి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు పూర్తవుతాయని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం చేస్తామన్నారు. 65 శాతం టీటీడీ నిధులతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర నిర్మాణం పనులు పూర్తి కాగానే.. భక్తులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే.. తిరుపతిలో ట్రాఫిక్ సమస్య ఉండదని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి అలిపిరి వద్ద నిర్మిస్తున్న చిన్నపిల్లల పీడియాట్రిక్ హాస్పిటల్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. తిరుమల ఘాట్ రోడ్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. ఘాట్ రోడ్లో వెళ్లేందుకు ఫిట్నెస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద మరో మూడు తనిఖీ లైన్లు అందుబాటులోకి తీసుకొస్తామని.. అత్యాధునిక స్కానింగ్ యంత్రాలతో తనిఖీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
Balineni Srinivas Reddy: పార్టీవారే ఇబ్బంది పెట్టారు.. సీఎంతో దాని గురించే చర్చించా
Also Read
- Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
- Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
- New ZPs: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
- Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
అలాగే.. గోవిందరాజస్వామీ ఆలయంలో రావిచెట్టు పడిపోయి మృతిచెందిన డాక్టర్ గుర్రప్ప కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాలి వాన భారీగా రావడంతో.. ఆ రావిచెట్టు పడిపోయిందన్నారు. ఈ ఘటనలో.. కడపకు చెందిన డాక్టర్ గుర్రప్ప మృదిచెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అ కుటుంబానికి జరిగిన బాధను భర్తీ చేయలేమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిజేస్తున్నానన్నారు. ఈ ఘటనలో ఒకరికి కాలు, మరొకరికి తలకు గాయాలయ్యాయని.. గాయపడిన వారికి మెరుగైన వైద్యను అందించాలని ఆదేశించానని అన్నారు. కాగా.. గత నెల 25వ తేదిన గోవిందరాజస్వామి ఆలయంలో మహసంప్రోక్షణను టీటీడీ నిర్వహించింది. 26వ తేది నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Pakistan: చంద్రుడిని చూసినమని అబద్ధం చెప్తే పాకిస్తాన్ లో 10 లక్షల జరిమానా
తాజావార్తలు
-
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
-
Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
-
Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్పై దాడులు చేయబోమన్న పుతిన్
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
-
BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!