YV Subba Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది..
- పార్లమెంట్ ఉభయ సభల్లో ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై ప్రస్తావిస్తాం..
- పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.5 మీటర్లకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తగ్గించింది..
- పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది: వైవీ సుబ్బారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YV Subba Reddy: బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో రాష్టానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించాలని దృష్టి సారించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 57 వేల కోట్ల అంచనాతో కేంద్రానికి నివేదిక పంపాం.. టీడీపీ నేతృత్వంలో “ఎన్డీయే” కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజక్ట్ ఎత్తును 41.5 మీటర్లకు తగ్గించింది.. అలాగే, పోలవరం నిధులు కుదించారు.. ఎత్తు తగ్గించడం వలన నీటి నిల్వ సామర్ధ్యం తగ్గి, రాష్ట్రం నష్టపోతుంది అని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర, సృజల స్రవంతికి నీరు అందించాలి.. దానిపై మా పోరాటం కొనసాగుతుంది.. విశాఖ రైల్వే జోన్ ఐదు ఏళ్లలో పూర్తి చేయాలని అప్పుడు కోరాం.. రైల్వే జోన్ పనులు ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది.. వాల్తేరు డివిజన్ స్ప్లిట్ చేసి ఒరిస్సాకు ఇచ్చారు అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Read Also: MP Horror: 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసిన బంధువులు..
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు నాలుగు ఐదు నెలల నుంచి జీతాలు రావడం లేదు అని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విశాఖ స్టీల్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా పోరాటం చేస్తాం.. విశాఖ స్టీల్ కు “కాప్టివ్ మైన్స్” పై రెండు సభల్లో ఒత్తిడి తీసుకొస్తాం.. స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ఇచ్చినా ఉద్యోగులలోఆందోళన ఉంది.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు సభలో మా నాయకుడు జగన్ పై, పార్టీ ఎంపీలపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు.. రాష్టానికి రావాల్సిన ప్రాజెక్టులకు మా వంతుగా పూర్తి సహకారం అందిస్తాం.. కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర అంశాలను వివరిస్తాం.. అలాగే, రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించక ఇబ్బందులు పడుతున్నారు.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి పంట కొనే పరిస్థితి లేదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!