YSRCP MP Vanga Geetha: వరదలకు అధిక వర్షాలే కారణం.. పోలవరం ఎత్తు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada YSRCP MP Vanga Geetha comments on polavaram project: తెలంగాణలోని భద్రాచలం ముంపునకు కారణం పోలవరం ప్రాజెక్టేనని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కాకినాడ వైసీపీ ఎంపీ వంగా గీత ఖండించారు. గోదావరి వరద కేవలం ఒక్కచోటనే రాలేదని… మహారాష్ట్రలో కూడా వరద వచ్చిందని ఎంపీ వంగా గీత వ్యాఖ్యానించారు. అధిక వర్షాలు మాత్రమే వరదకు కారణం అవుతున్నాయని.. ఇలాంటి కామెంట్లను తాము పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. 1986 తర్వాత తొలిసారి భారీ స్థాయిలో వరద వచ్చిందని ఆమె గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు అనేది సాంకేతిక అంశం మాత్రమే అన్నారు. కానీ ఈసారి వచ్చిన వరదలు మాత్రం ఎత్తుతో సంబంధం లేకుండా కురిసిన అధిక వర్షాల కారణంగా వచ్చాయని వంగా గీత అభిప్రాయపడ్డారు.
Read Also: V.Prakash: పోలవరంతో భద్రాచలానికి ముంపు తప్పదు
Also Read
- Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
అటు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమంతా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే నడుస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేయడానికి వీలు లేదన్నారు. డిజైన్లలో కరెక్షన్లపై చర్చలు జరుగుతున్నాయన్నారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణమే టాప్ ప్రయారిటీ అన్నారు. జీవనోపాధి పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. రూ.20వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ఖర్చుతో రహదారులు వేస్తోందని తెలిపారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతుల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నామని.. ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kartik Aaryan: అస్సాం వరద బాధితులకు కార్తీక్ ఆర్యన్ భారీ సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.1 కోటి విరాళం
-
Commonwealth Games 2026: భారత్కు డబుల్ మెడల్.. నీరజ్ చోప్రాకు రజతం, యశ్వీర్ సింగ్కు కాంస్యం
-
Aaron Finch: వరల్డ్ క్రికెట్లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్
-
Jagapathi Babu: ఎవరూ నన్ను కొట్టలేదు.. అసలు నిజం చెప్పి ఊరట ఇచ్చిన జగ్గూభాయ్!
-
PM Modi: ‘తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు’.. తప్పుదారి పట్టిన యువతకు సరైన మార్గం చూపాలి.. ప్రధాని మోడీ కొత్త వీడియో..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!