Dokka Manikya Vara Prasad: తాడికొండ వివాదం.. ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు ఈ మధ్య హాట్ టాపిక్గా మారిపోయింది.. నియోజకవర్గానికి అదనపు ఇంఛార్జ్గా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ను నియమించడానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె వర్గం జీర్ణించుకోలేకపోతోంది.. ఈ పరిణామంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదేమోనని ఆందోళనలో ఆమె ఉన్నారు.. డొక్కా మాణిక్యవరప్రసాద్ నియమాకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుచరులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం చర్చగా మారిపోయింది.. అయితే, ఈ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డొక్కా మాణిక్యవరప్రసాద్.
Read Also: Child Marriage: 62 ఏళ్ల అధికార పార్టీ నేత నిర్వాకం.. 16 ఏళ్ల బాలికతో పెళ్లి..!
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
తాడికొండ నియోజకవర్గంలో వివాదం తాత్కాలికమని తేల్చేశారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఎమ్మేల్యే శ్రీదేవితో వివాదం తాత్కాలికమేన్న ఆయన.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నాయకత్వంలోనే అందరం పని చేస్తామని స్పష్టం చేశారు.. తాడికొండ నియోజకవర్గంలో సమన్వయం కోసం నన్ను నియమించారని తెలిపిన ఆయన.. శ్రీదేవితో వున్న వివాదం తగ్గుముఖంపడుతుందని.. సమన్వయం చేసుకోని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్. కాగా, తాడికొండ అదనపు ఇంఛార్జ్గా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ను నియమించడంతో.. మొదట ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం ఆందోళనకు దిగింది.. ఆ తర్వాత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అనుచరులు కూడా రంగంలోకి దిగారు.. రెండు వర్గాలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. డొక్కాకు వ్యతిరేకంగా శ్రీదేవి అనుచరులు నినాదాలు చేస్తే.. శ్రీదేవికి వ్యతిరేకంగా డొక్కా వర్గీయులు నినాదాలు హోరెత్తించారు.. ఈ వ్యహారం మొత్తంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!