YS Viveka Murder Case: వైఎస్ వివేకా ఇంటి వాచ్మెన్ మృతి.. కీలక వ్యాఖ్యలు చేసిన రంగన్న భార్య
- వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న మృతి..
- ఆ నలుగురే వివేకాను హత్య చేశారని గతంలో రంగన్న సీబీఐకి స్టేట్మెంట్..
- రంగన్న భార్య సుశీలమ్మ కీలక వ్యాఖ్యలు..
- గత ప్రభుత్వంలో మమ్మల్ని బాగా చూసుకున్నారు..
- గత ప్రభుత్వంలో 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటిలో గతంలో వాచ్మెన్గా పనిచేసిన రంగన్న అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కుటుంబ సభ్యులు చికిత్స కోసం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగన్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కి తరలించారు. చికిత్స పొందుతూ రంగన్న మృతి చెందారు.. అయితే, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రంగన్న ప్రధాన సాక్షిగా ఉన్నారు. వివేకను హత్య చేసిన హంతకులను రంగన్న గుర్తించడంతో సీబీఐ విచారణ మొదలైంది. ఆ నలుగురే వివేకాను హత్య చేశారని గతంలో రంగన్న సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చారు.
Read Also: AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక, ఆ బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగింత..
Also Read
ఇక, మృతుడు రంగన్న భార్య సుశీలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు.. నా భర్త రంగన్న అనారోగ్య సమస్యతో బాధపడేవారన్నారు.. గత ప్రభుత్వంలో మమ్మల్ని బాగా చూసుకున్నారు.. గత ప్రభుత్వంలో 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చేవారని తెలిపారు.. అయితే, గత మూడు నెలల నుంచి నా భర్త చాలా మానసికంగా దెబ్బతిన్నాడు.. నా భర్త ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారని వెల్లడింఆచరు.. నీవు వచ్చేలోపు నేను బ్రతుకుతానో లేదో అని నాతో అన్నాడని గుర్తుచేసుకున్నారు.. నా భర్తకు బాగాలేదని మా ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసులు నాకు ఫోన్ చేసి చెప్పారని.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.. ఇక, నా భర్త ఊపిరితిత్తుల వ్యాధితోనే మృతి చెందాడని తెలిపారు వాచ్మెన్ రంగన్న భార్య సుశీలమ్మ..
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?