YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి మృతి..
- వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి మృతి..
- కడప రీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత..
- వైఎస్ వివేకా హత్య సమయంలో వాచ్మెన్ గా ఉన్న రంగన్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Murder Case: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలనం సృష్టించిన విషయం విదితమే.. అయితే, వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తి ఈ రోజు మృతిచెందారు.. వైఎస్ వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న ఈ రోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.. రంగన్న వయస్సు 85 సంవత్సరాలు.. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రంగన్న తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. అయితే, కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రంగన్న మృతిచెందారు..
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన కోర్టు..
Also Read
కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు.. ఆ సమయంలో వివేకా ఇంటి దగ్గర వాచ్మెన్గా పని చేశారు రంగన్న.. దీంతో, వైఎస్ వివేకా మర్డర్ కేసులో కీలకంగా మారారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐకి ముఖ్యమైన వాంగ్మూలం ఇచ్చారు.. కీలకమైన అంశాలను వెల్లడించారు.. ఇక, వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సీబీఐ అప్పట్లో పేర్కొంది.. అంతేకాదు.. ఛార్జిషీట్లో కూడా పలు అంశాలను ప్రస్తావించింది. ఆ తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు రంగన్న.. ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురికావడం.. ఆస్పత్రికి తరలించడంతో.. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనూ ప్రాణాలు విడిచారు.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!