MLA Madhavi Reddy: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనూ కుర్చీ గొడవ.. ఎమ్మెల్యే ఫైర్..
- కడపలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కుర్చీ గొడవ..
- వేదికపై తనకు కుర్చీ వేయకపోవడంపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం..
- జేసీపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే..
- తర్వాత కుర్చీ వేయించినా కూర్చోకుండానే వెనక్కి..
MLA Madhavi Reddy: కడపలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కుర్చీ పంచాయితీ చోటు చేసుకుంది.. గతంలో, కడప మున్సిపల్ సమావేశాల్లో కుర్చీ కోసం గొడవకు దిగిన ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి.. ఇప్పుడు.. ఇండిపెండెంట్ వేడుకల్లోనూ కుర్చీ విషయంలో అధికారులపై కస్సుబుస్సులాడారు.. కడప ఇండిపెండెన్స్ డే వేడుకల్లో వేదికపై సముచిత స్థానం కల్పించ లేదని కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ఫైర్ అయ్యారు.. వేడుకలు జరుగుతున్న వేదిక దగ్గరే నిల్చుని ఉండిపోయారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి. తనకు వేదికపై కుర్చీ వేయలేదంటూ జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలీసు అధికారులు, చివరకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసిన కుర్చీలో కూర్చోకుండానే.. వెనుదిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి..
Read Also: Venky77 : వెంకీ మామ – త్రివిక్రమ్.. పూజ కార్యక్రమలతో మొదలెట్టేసారు
Also Read
అయితే, ప్రోటోకాల్ ప్రకారం వేదికపై మంత్రి, అధికారులకే చోటు కల్పించారు. కానీ, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పక్కన తనకు కుర్చీ వేయలేదని అలిగారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. దీంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారింది.. కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా జేసీ అతిధి సింగ్ పై ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.. జేసీని గుడ్లు ఉరిమి చూశారు.. తనను స్టేజ్ పైకి ఆహ్వానించక పోవడంపై ఫైర్ అయ్యారు.. అయితే, స్టేజ్ పైకి రావాలని ఎమ్మెల్యేని కోరారు జిల్లా కలెక్టర్.. ఆమె తిరస్కరించడంతో.. అక్కడికి వెళ్లి కూర్చోమని కలెక్టర్ చెప్పారు. కానీ, దాదాపు అరగంటకు పైగా నిల్చొనే ఉన్న మాధవి రెడ్డి.. ఆ తర్వాత వెనుదిరిగి వెళ్లిపోయారు.. ఈ కార్యక్రమంలో స్టేజీపై ముఖ్య అతిధి మంత్రి ఫరూక్, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అతిధి సింగ్ మాత్రమే ఉండగా.. ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడమే.. తాజా వివాదానికి కారణమైంది.
తాజావార్తలు
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో