WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు కడప జిల్లా విద్యార్థిని.. హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
- ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్కు సెలెక్ట్ అయిన గ్రామీణ విద్యార్థిని
- రూ. 55 లక్షల పారితోషకంతో ఢిల్లీ క్యాపిటల్స్కు సెలెక్ట్ అయిన శ్రీ చరణి
- కడప జిల్లా వీరపనేనిపల్లి మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన శ్రీ చరణి
- తమ కుమార్తె డబ్ల్యూపీఎల్కు సెలెక్ట్ కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. తాజాగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ వేలంలో ఈ విద్యార్థిని అమ్ముడుపోయింది. రూ. 55 లక్షల పారితోషకంతో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీ చరణి అనే విద్యార్ధిని సొంతం చేసుకుంది. శ్రీ చరణి ఆంధ్రప్రదేశ్కు చెందిన అమ్మాయి. కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన విద్యార్థిని.
Read Also: Jagadish Reddy: దమ్ముంటే రైతులకు ఇచ్చిన హామీలపై చర్చ పెట్టాలి..
Also Read
ఓ సాధారణ కుటుంబానికి చెందిన శ్రీ చరణి.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆడబోతుంది. శ్రీ చరణి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి.. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్కు తమ కుమార్తె సెలెక్ట్ కావడంపై తల్లిదండ్రులు, బంధువులు, గ్రామాస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Earthquake: వనౌటు ద్వీపాన్ని వణికించిన భారీ భూకంపం.. పలు ఎంబసీ కార్యాలయాలు ధ్వంసం
2025లో జరిగే మూడో సీజన్ కోసం బెంగుళూరులో మెగా వేలం నిర్వహించారు. ఈ మెగా వేలంలో మొత్తం 120 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. అందులో 91 మంది భారతీయులు ఉండగా.. 29 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తం ప్లేయర్లలో ముగ్గురు అసోసియేట్ నేషన్స్కు చెందినవారు ఉన్నారు. భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. 82 మంది అన్క్యాప్, 9 మంది క్యాప్లో ఉన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుచుకుంది. రెండో సీజన్ టైటిల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సొంతం చేసుకుంది. కాగా.. ఈ రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో నిలిచింది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..