Kadapa: టీడీపీ అధికారంలో రావడం సంతోషకరం.. ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం సాధించింది. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా.. టీడీపీ నేతలు విజయానందంలో మునిగితేలుతున్నారు. కాగా.. విజయంపై కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ పై నమ్మకంతో ప్రతిపక్షమే లేని మెజార్టీని ప్రజలు ఇచ్చారని తెలిపారు. 2019లో వైసీపీ ఇచ్చిన మోసాలు నమ్మి మోసపోయామని ప్రజలు భావించారని.. వాళ్ళ నాయకుడే ఓటమిని ఒప్పుకున్నారన్నారు. మరోవైపు.. ఈవీఎంలను ట్యాపరింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు. అభివృద్ధిలో కలిసి పని చేస్తామంటే తాము కూడా కలిసి పనిచేయడానికి సిద్ధమని పేర్కొ్న్నారు. అవినీతిని బయటకు తీస్తామని తెలిపారు.
Read Also: CM Revanth Reddy: ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇదే.. !
Also Read
మరోవైపు.. రాజంపేటలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చామర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో రావడం సంతోషకరమని అన్నారు. టీడీపీ గెలుపులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని.. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు బర్తరఫ్ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇటువంటి ఫలితాలు వచ్చాయన్నారు. తిరిగి అంతకన్నా దారుణ ఫలితాలను వైసీపీకి 11 సీట్లను ప్రజలు ఇచ్చారని తెలిపారు. దేశంలోనే టీడీపీ విజయం చారిత్రాత్మకమైందని.. రాజంపేటలో టీడీపీ అభ్యర్థి చిన్న చిన్న తప్పులతో ఓటమి చెందారని అన్నారు. భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతామని జగన్ మోహన్ రాజు తెలిపారు.
Read Also: Jr NTR: ప్రియమైన బాబు మావయ్య, బాలకృష్ణ బాబాయ్.. సంచలనం రేపుతున్న ఎన్టీఆర్ ట్వీట్
- Tags
- janasena
- NDA
- Power
- tdp
- telugu news
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!