Mandipalli Ramprasad Reddy: గత ప్రభుత్వంలో భూ పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయి..
- గత వైసీపీ ప్రభుత్వంలో భూ పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయి..
- భూ పంపిణీపై విచారణ జరిపి అనర్హులు దోచుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలి..
- అనర్హులకు భూములు పంపిణీ చేశారు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mandipalli Ramprasad Reddy: అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండల పరిషత్ సమావేశ భవనంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాయచోటి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో భూ పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అనర్హులకు భూములు పంపిణీ చేశారు.. గతంలో జరిగిన భూ పంపిణీపై విచారణ జరిపి అనర్హులు దోచుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలంటూ సమీక్ష సమావేశంలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రికి ఫోన్ చేసి రాంప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
Read Also: Paris Olympics: క్వార్టర్ ఫైనల్స్లో గెలిచిన తర్వాత భావోద్వేగానికి గురైన ఇమానే ఖలీఫ్..
Also Read
కాగా, ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకొని అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అధికారులు సమన్వయంతో పని చేసి గాలివీడు మండలాభివృద్ధికి కృషి చేయాలి.. రెవెన్యూ అధికారులు నిజాయితీగా పని చేయాలి అని కోరారు. గృహ నిర్మాణ శాఖలో కూడా అవినీతి, అక్రమాలు జరిగాయి.. త్వరలో వీటిపై కూడా విచారణ జరిపిస్తాం.. అంగన్వాడీ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదు.. ప్రభుత్వం అందించే పౌష్టికాహారం చిన్నారులకు సక్రమంగా అందేలా చూడాలి.. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ లను ప్రారంభిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!