TDP vs YSRCP Clash: పులివెందుల వైసీపీ నేతలపై దాడి ఘటనలో 25 మందిపై కేసు..
- పులివెందుల వైసీపీ నేతలపై దాడి ఘటనలో 25 మందిపై కేసు..
- వైసీపీ నేత రాము ఫిర్యాదుతో 25 మందిపై హత్యాయత్నం కేసు..
- పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డిపైనా కేసు..
- వైసీపీ నేతలపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టిన పోలీసులు..
TDP vs YSRCP Clash: కడప జిల్లా పులివెందుల వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేసిన కేసులో 25 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేత వేముల రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు.. నిన్న పులివెందల మండలం నల్లగొండ వారి పల్లె ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాముపై టీడీపీ కార్యక్తరలు దాడికి పాల్పడ్డారు. కార్లతో గుద్ధి ఆపై కర్రలతో దాడి చేశారని పోలీసులకు వేముల రాము కంప్లైంట్ చేశాడు.
Read Also: Grok Spicy Mode: AIకి కూడా ‘స్పైసీ’ మూడ్.. అడల్ట్ కంటెంట్ మరింత ప్రమాదంగా మారనుందా?
Also Read
ఇక, టీడీపీకి చెందిన 25 మందితో పాటు మరికొందరిపై నాన్ బెయిలబుల్ కేసును పోలీసులు నమోదు చేశారు. పులివెందుల టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డితో పాటు మరో 24 మందిపై కేసు ఫైల్ చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు, వైసీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. పులివెందుల మండలం నల్లగొండ వారి పల్లెలో వేముల రాము, హేమాద్రి తనను కులం పేరుతో దూషించారని ధనుంజయ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
Read Also: Tollywood : సినీ కార్మికుల 4వ రోజు సమ్మె.. నేడు ఛాంబర్ లో కీలక భేటీ
మరోవైపు, ఎన్నికల నిమావళి ఉల్లంఘించారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందల ఎంపీడీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ర్యాలీ నిర్వహించారని ఫిర్యాదులో ఎంపీడీవో పేర్కొన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది వైసీపీ నేతలపై కేసు నమోదు అయింది.
తాజావార్తలు
-
Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
-
Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!
-
Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?