Andrapradesh : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. అధికారులు యాక్సిడెంట్స్ పై ఎంతగా అవగాహన పెంచుతున్నా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.. నిన్న అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన జరిగింది.. ఆ ఘటన ఇంకా కళ్ల ముందే ఉండగా.. ఇప్పుడు మరో ఘోరం జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదురుగు మృతి చెందినట్లు తెలుస్తుంది…
వివరాల్లోకి వెళితే..అన్నమయ్య జిల్లాలోని పీలేరులో ఈరోజు తెల్లవారు జామున దారుణ ఘటన చోటు చేసుకుంది.. లారీని వేగంగా వస్తున్న తుఫాన్ వాహనం ఢీ కొట్టింది..ఐదుగురు మృతి చెందగా, పలువురికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు..
Also Read
పీలేరులోని ఎంజేఆర్ కాలేజీ వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, తుఫాన్ వాహనం నంద్యాల నుంచి తిరువన్నమలైకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 11 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్సను అందిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..