YS Jagan: రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు..
- ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై వైఎస్ జగన్ ఫైర్..
- రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు..
- ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం అడుగులేస్తుంది..
- చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదు..
- ఏపీలో ఎన్నో ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది..
- రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకపోతే చంద్రబాబు ఎందుకు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రాష్ట్ర ప్రయోజనాలను సీఎం చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు.. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, ఎత్తు పెంచడానికి ఆ రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదు అని విమర్శించారు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా సరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే, రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా?.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి? అని వైఎస్ జగన్ ఆగ్రహ వ్యక్తం చేశారు.
Read Also: Sujeeth: ఆ సినిమాతోనే నా ప్రయాణం మొదలు.. ‘జానీ’ లేకపోతే నేను లేను
Also Read
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
ఇక, గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణాజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది అని మాజీ సీఎం జగన్ అన్నారు. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు నీటిని నిల్వచేయడానికి అవసరమైన పనులు, స్పిల్వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే అప్పట్లో మీరు సీఎంగా ఉన్నా, మీ ఎంపీల బలం మీదే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా, 1995-2004 వరకూ కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా మీరు గొప్పలు చెప్పుకున్న కాలంలో, మీకున్న రాజకీయ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడలేదన్నది నిజమే కదా? అని ప్రశ్నించారు. ఇక, సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితం అయినా, చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు అప్పటి కర్ణాకట ప్రభుత్వం పూర్తి చేసిందనేది వాస్తవం కాదా? అని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
Read Also: Off The Record: ఆ టీడీపీ నేతలు వైసీపీతో కలిసి పార్టీని తగలెట్టేస్తున్నారా?
అయితే, గడచిన రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం.. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబు?.. ఇప్పుడు మళ్లీ, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు.. మళ్లీ ఆల్మట్టిలో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమయ్యింది అన్నారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, దీని కోసం రానున్న 3 ఏళ్లలో రూ.70 వేల కోట్లు ఖర్చు చేయాలని కన్నడ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించడం లేదు.. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని కదా అని చంద్రబాబును ప్రశ్నించారు.
Read Also: CM Chandrababu: ఆ తల్లి చల్లని చూపు రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలి..
కాగా, చంద్రబాబు మీరు ఇప్పటికైనా మేలుకోండి అని వైఎస్ జగన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి అని పేర్కొన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతో పాటు, KWDT-2 విచారణపై దృష్టి పెట్టి, సమర్థవంతమైన వాదనలు వినిపించండి అన్నారు. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మీరు మిగిలిపోతారు అని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!