YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- గుంటూరు ఘటనపై జగన్ ఆగ్రహం
- ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపణ
- 'రెడ్ బుక్ రాజ్యాంగం'పై విమర్శలు
- మహిళల భద్రత ఎక్కడ? ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో ఓ మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దారుణంగా దాడి చేసిన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అమానుష ఘటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా (‘ఎక్స్’) స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ దారుణం కేవలం మానవత్వానికే మచ్చ కాదని, రాష్ట్రంలో పూర్తిగా విఫలమైన శాంతిభద్రతలకు నిలువెత్తు నిదర్శనమని దుయ్యబట్టారు. ఇటువంటి ఘోరమైన ఘటన జరిగినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేశారు.
మూడు రోజులు కప్పిపెట్టి.. ఇప్పుడు నాటకాలా?
ఈ ఘటన బుధవారం జరిగితే, ప్రభుత్వం మూడు రోజుల పాటు బయటకు రాకుండా కప్పిపుచ్చిందని జగన్ ఆరోపించారు. చివరకు ఆ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. “వీడియోలు బయటకు వచ్చాక తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హడావుడి చేయడం సిగ్గుచేటు. ఆ వీడియోలను దాచడంపై పెట్టిన శ్రద్ధను.. తొలిసారి దాడి జరిగినప్పుడే, బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించినప్పుడు పెట్టి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదు కదా?” అని ప్రశ్నించారు. బాధితురాలి ఫిర్యాదుపై వెంటనే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకోకుండా, స్టేషన్లలో పంచాయితీలు చేయడానికి ప్రయత్నించడం ఏ రకమైన పోలీసింగ్ అని నిలదీశారు. వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు విలువ లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- OTR : గంటా గేమ్ మారిందా..? భీమిలి సీటు వదులుకునేందుకు సిద్ధమా..?
‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో జంగిల్ రాజ్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. “ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై దాడులను చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను ఒక రాజకీయ ఆయుధంగా మార్చేసింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చి, ప్రతిపక్షాలు, బాధితులపై అక్రమ కేసులు పెట్టడానికి వాడుకుంటూ రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’ (అడవి చట్టం) గా మార్చారు” అని మండిపడ్డారు.
టీడీపీ నేతలు దుశ్శాసనుల్లా తయారయ్యారు
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ పాలనలో గ్రామాలు, వార్డుల స్థాయి వరకు పాకిందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారని విమర్శించారు. మహిళలపై ఎలాంటి దారుణాలు చేసినా, అవమానించినా తమను కాపాడటానికి చంద్రబాబు ఉన్నారనే ధైర్యం వారిలో పెరిగిపోవడం వల్లే ఇవాళ రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అధికార పార్టీ నేతల దురాగతాల నుంచి మహిళలు తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. “చంద్రబాబు గారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన?” అంటూ ప్రశ్నించిన వైఎస్ జగన్, మహిళల ఆగ్రహమే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!