CM Jagan: రోడ్లు, మెట్రో రైలుపై అధికారులకి కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ శాఖ పరిధిలోని వివిధ కార్యక్రమాల్ని సమీక్షించిన సీఎం.. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రావ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని.. గుంతలు లేని రోడ్లు కనిపించాలని సూచించారు. రాజధానిలో కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్ని వేగవంతం చేయాలన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లేఅవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని.. నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ తప్పనిసరిగా పాటిస్తూ ఈ నిర్మాణాలు ఉండాలని చెప్పారు. వివాదాలు, ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకి అందించాలన్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్పై కూడా సమీక్షించిన సీఎం.. వనరుల సమీకరణపై అధికారులతో సమాలోచనలు చేశారు. సుమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రతిపాదన చేశారు. ఈ ప్రాజెక్ట్పై సమగ్ర నివేదిక ఇవ్వాలని.. అలాగే ప్రస్తుతమున్న ప్రాజెక్టులో భాగంగా కోచ్ల డిజైన్, స్టేషన్లలో కల్పించాల్సిన సౌకర్యాలు, ఇతర వివరాల్ని సమర్పించాలని సీఎం తెలిపారు. పర్యావరణ విధానాలకూ పెద్దపీట వేయాలని సూచించారు.
Also Read
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
- Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
ఈ నేపథ్యంలోనే అధికారులు స్పీడ్ యాక్సెస్ రోడ్డుపైన దృష్టి పెట్టామని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. అటు, జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కోసం అర్బన్ నియోజకవర్గాల్లో 6,791 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్ఆర్, కర్నూలు, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మొత్తం 864.29 ఎకరాల్లో లేఅవుట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. మే చివరి నాటికి ఇవి సిద్ధమవుతాయని, అలాగే రోడ్ల పనులు జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్తో డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?