YS Jagan Mohan Reddy: తన కాన్వాయ్ ఆపి.. ఆంబులెన్స్కి దారిచ్చిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Mohan Reddy Gives Way For Ambulance By Stopping His Convoy: మదెనపల్లిలోని విద్యాదీవెన కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి హెలిపాడ్ నుంచి సభావేదిక వద్దకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్తుండగా.. 108 అంబులెన్స్కు దారిచ్చారు. అక్కడి నుంచి ఆంబులెన్స్ వెళ్లేంతవరకూ.. తన కాన్వాయ్ను పక్కన ఆపారు. ఆంబులెన్స్ వెళ్లాక, ఆయన కాన్వాయ్ ముందుకు కదిలింది. అనంతరం సీఎం జగన్ విద్యాదీవెన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఏపీ సీఎంఓ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
మరోవైపు.. విద్యాదీవెన పథకం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ బటన్ నొక్కి, నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దీనివల్ల 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో.. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంటును ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మన ఇచ్చే ఆస్తి చదువేని, కుటుంబాల తలరాత మారాలన్నా, పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గమని అన్నారు.
Also Read
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- OTR : ప్రజా సమస్యలపై వామపక్షాలతో కలిసి వైసీపీ పోరాటం..?
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి 250 సరుకులు.. రూ.5 తక్కువకే..
- OTR : గంటాకు క్లీన్ చిట్ మిషన్.. కలెక్టర్కు లేఖ వెనుక అసలు కథ.!
చదువులకు పేదరికం అవరోధం కావొద్దన్న ఉద్దేశంతోనే దివంగత నేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని.. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నీరుగార్చాయని జగన్ అన్నారు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు చూసి.. అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నామని చెప్పారు. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చి, పేదలకు చదువును హక్కుగా మార్చామన్నారు. చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించి, జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించామని పేర్కొన్నారు.
విద్యాదీవెన పథకం కార్యక్రమానికి మదనపల్లెలో హెలిపాడ్ నుంచి సభావేదిక వద్దకు వెళ్తుండగా, 108 అంబులెన్స్కు దారిచ్చిన ముఖ్యమంత్రిగారు ప్రయాణిస్తున్న బస్సు. pic.twitter.com/9DRcO5PTbb
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 30, 2022
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!