YS Jagan Mohan Reddy: కాపు ఓట్లను దత్తపుత్రుడు హోల్సేల్గా అమ్మేస్తాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Mohan Reddy Comments On Pawan Kalyan: కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి జనసేనాధినేత పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. కాపుల ఓట్లను కొంతమేర అయినా మూటగట్టి, మరోసారి చంద్రబాబుకు హోల్సేల్గా అమ్మేందుకు దత్తపుత్రుడు ప్రయత్నాలు చేస్తున్నాడని పరోక్షంగా పవన్ని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయాలు మరింత దిగజారిపోయాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దుష్ట చతుష్టయానికి దత్తపుత్రుడు కూడా తోడయ్యాడని పేర్కొన్నారు.
వాళ్లు (చంద్రబాబును ఉద్దేశించి) తనకు దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చని చెప్పిన జగన్.. ప్రజల దీవెనలు, ఆ దేవుడి ఆశీస్సులు తనకు ఉన్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ అనే తేడాలు లేకుండా తాము సంక్షేమం అందిస్తున్నామని.. అర్హత ఒక్కటే ప్రమాణంగా తీసుకుని మంచి చేస్తున్నామని అన్నారు. మనం డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) చేస్తుంటే.. చంద్రబాబు హయాంలో డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) చేసేవారని ఆరోపించారు. వరద బాధితులల్ని కూడా ఇబ్బంది పడకుండా ఆదుకుంటున్నామని, రేషన్తో పాటు ప్రతీ ఇంటికి రూ. 2 వేలు ఇస్తున్నామని వైఎస్ జగన్ చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Heroines Exposing : పాన్ ఇండియా క్రేజ్ కోసం బోల్డ్ మేకోవర్లో హీరోయిన్లు
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Disney D23 2026: డిస్నీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… రాబోయే మూడేళ్ల సినిమాల జాబితా ఇదే!
-
Vivo Y6k: వివో Y6k త్వరలో లాంచ్?.. Google Play Console లిస్టింగ్లో కీలక వివరాలు
-
Sunday Rasi Phalalu: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బు రాక మొదలు!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!