YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన.. ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు
- నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన..
- అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు..
- నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు..
- నకిలీ మద్యంపై చనిపోయిన వారి కటుంబాలకు వైసీపీ అండగా ఉంటుంది: రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. నకిలీ మద్యంతో చనిపోయిన వారికి అండగా వైసీపీ పోరాటం చేస్తుంది.. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో 20 వేల లీటర్ల నకిలీ మద్యం దొరికింది.. చంద్రబాబు, లోకేష్ మద్దతు లేకుండా నకిలీ మద్యం తయారీ చేయగలరా అని ప్రశ్నించింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదని సూచించింది. మాపై నకిలీ మద్యం లిక్కర్ కేసులు పెట్టారు.. ఇప్పుడు నిజంగానే వారు దొరికారు అని ఎద్దేవా చేసింది. జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్టు అయితే చంద్రబాబు ఎలా ఎమ్మెల్యే సీటు ఇచ్చాడు అని క్వశ్చన్ చేసింది. చంద్రబాబు అనుభవం అంతా అవినీతి డబ్బు కోసమే.. చంద్రబాబు సిగ్గు లేకుండా సిట్ వేస్తానని చెబుతున్నాడు.. సిట్ వల్ల ఉపయోగం లేదు.. సీబీఐ విచారణ కావాలని ఆర్కే రోజా డిమాండ్ చేసింది. అయితే, పవన్ కు లిక్కర్ స్కాంలో ముడుపులు అందాయని ఆరోపించింది. ప్రశ్నించాల్సిన పవన్ సైలెంట్ గా ఉన్నాడంటే అతడికి పెద్ద ఫ్యాకేజ్ అందిందని పేర్కొన్నారు. కిలారి రాజేష్ ద్వారా లోకేష్ కు మద్యం ముడుపులు అందాయి.. కల్తీ మద్యం అమ్మకాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.
Read Also: Jubilee Hills by-election: రేపటిలోపు అభ్యర్థిని ప్రకటిస్తాం.. గెలిపించాలని కోరుతున్న..!
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
మరోవైపు, కల్తీ మద్యంపై వైసీపీ నిరసన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీ ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు అని పెట్టుకో అని సూచించారు. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేశావు కాబట్టి ఆగారు అని నువ్వు అనుకుంటున్నావు.. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేసి ఒక కత్తి ఇచ్చి చూడు నువ్వు కట్టిన తాళ్ళను పరా పరా తెంపేసి వాళ్ళు నిన్ను తిరగబడి తన్నకపోతే చూడు అన్నారు. నీ గన్ మెన్ లు ఉన్న నిన్ను టీడీపీ కార్యకర్తలు కొట్టకపోతే నన్ను అడుగు అన్నారు. కడుపు రగిలిపోయి సచ్చిపోతున్నారు, అల్లాడి ఏడుస్తున్నారు.. మన ఇంట్లో వాళ్ళు భాష, శివ రామ కృష్ణ, సమాధులు దొడ్డి దగ్గర ఉన్న బాబాయ్ ఈ కుమ్ముడికి జెండా మోసిన కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారని పేర్నినాని తెలిపారు.
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!