YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన.. ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు
- నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన..
- అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు..
- నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు..
- నకిలీ మద్యంపై చనిపోయిన వారి కటుంబాలకు వైసీపీ అండగా ఉంటుంది: రోజా
YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. నకిలీ మద్యంతో చనిపోయిన వారికి అండగా వైసీపీ పోరాటం చేస్తుంది.. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో 20 వేల లీటర్ల నకిలీ మద్యం దొరికింది.. చంద్రబాబు, లోకేష్ మద్దతు లేకుండా నకిలీ మద్యం తయారీ చేయగలరా అని ప్రశ్నించింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదని సూచించింది. మాపై నకిలీ మద్యం లిక్కర్ కేసులు పెట్టారు.. ఇప్పుడు నిజంగానే వారు దొరికారు అని ఎద్దేవా చేసింది. జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్టు అయితే చంద్రబాబు ఎలా ఎమ్మెల్యే సీటు ఇచ్చాడు అని క్వశ్చన్ చేసింది. చంద్రబాబు అనుభవం అంతా అవినీతి డబ్బు కోసమే.. చంద్రబాబు సిగ్గు లేకుండా సిట్ వేస్తానని చెబుతున్నాడు.. సిట్ వల్ల ఉపయోగం లేదు.. సీబీఐ విచారణ కావాలని ఆర్కే రోజా డిమాండ్ చేసింది. అయితే, పవన్ కు లిక్కర్ స్కాంలో ముడుపులు అందాయని ఆరోపించింది. ప్రశ్నించాల్సిన పవన్ సైలెంట్ గా ఉన్నాడంటే అతడికి పెద్ద ఫ్యాకేజ్ అందిందని పేర్కొన్నారు. కిలారి రాజేష్ ద్వారా లోకేష్ కు మద్యం ముడుపులు అందాయి.. కల్తీ మద్యం అమ్మకాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.
Read Also: Jubilee Hills by-election: రేపటిలోపు అభ్యర్థిని ప్రకటిస్తాం.. గెలిపించాలని కోరుతున్న..!
Also Read
- Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
- Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
మరోవైపు, కల్తీ మద్యంపై వైసీపీ నిరసన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీ ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు అని పెట్టుకో అని సూచించారు. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేశావు కాబట్టి ఆగారు అని నువ్వు అనుకుంటున్నావు.. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేసి ఒక కత్తి ఇచ్చి చూడు నువ్వు కట్టిన తాళ్ళను పరా పరా తెంపేసి వాళ్ళు నిన్ను తిరగబడి తన్నకపోతే చూడు అన్నారు. నీ గన్ మెన్ లు ఉన్న నిన్ను టీడీపీ కార్యకర్తలు కొట్టకపోతే నన్ను అడుగు అన్నారు. కడుపు రగిలిపోయి సచ్చిపోతున్నారు, అల్లాడి ఏడుస్తున్నారు.. మన ఇంట్లో వాళ్ళు భాష, శివ రామ కృష్ణ, సమాధులు దొడ్డి దగ్గర ఉన్న బాబాయ్ ఈ కుమ్ముడికి జెండా మోసిన కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారని పేర్నినాని తెలిపారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!