Yarnagudem Mystery Case: మహిళపై దారుణం.. మిస్టరీ కేసులో ముగ్గురి అరెస్ట్
మిస్టరీగా మారిన ఒక మహిళ హత్యకేసుని చేధించారు పోలీసులు. మహిళ మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి వాటిని సూట్ కేసుల్లో పెట్టి పోలవరం కాలువ వద్ద పడేసిన ఘటన సంచలనం రేపింది.తూర్పుగోదావరిజిల్లా యర్నగూడెంలో తీవ్ర కలకలం రేపిన ఈ మిస్టరీ మర్డర్ కేసును చేధించిన పోలిసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. తూర్పుగోదావరిజిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం పోలవరం కుడి కాలువ సమీపంలోని బ్రిడ్జ్ వద్ద మహిళ మృతదేహాన్ని రెండు సూట్ కేసుల్లో పెట్టి పడేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయసు గల మహిళను హత్య చేసి అనంతరం రెండు ముక్కలుగా నరికి పొట్ట నుండి పై భాగం ఒకచోట, కాళ్ల నుండి కింది బాగం ను ఒక బ్యాగ్ లో పెట్టీ మరోచోటా పడేసారు. అదే బ్యాగ్ లో హత్యకు ఉపయోగించిన గీత కత్తి ,కత్తెరను సైతం పోలవరం కాలువలో గుర్తుతెలియని వ్యక్తుల పడేసారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. పోలవరం కాలువలో మృతదేహం ఉందని సమాచారంతో రంగంలోకి దిగిన పోలిసులు మృతదేహం రెండు భాగాలను వెలికి తీసి పోస్టుమార్టంకి పంపించారు. మిస్టరీగా మారిన కేసును చేధించేందుకు పోలిసులు మిస్సింగ్ కేసులపై దృష్టిపెట్టారు.
Also Read
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
- AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
పోలిసులు విచారణ చేపట్టడంతో అసలు విషయాలు వెలుగు చూసాయి. గోపాలపురానికి చెందిన కత్తెవ శ్రీదేవికి వెంకట సత్యనారాయణకు 36ఏళ్ళ క్రితం పెళ్లి అయింది. సత్యనారాయణ టైలరింగ్ చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. చాలా కాలం నుండి భార్యపై అనుమానంతో మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈక్రమంలో భార్యపై కక్షపెంచుకున్న సత్యనారాయణ భార్య శ్రీదేవి తలని గోడకి కొట్టి అనంతరం కత్తితో పీక నరికి చంపేసాడు.
Read Also:Dropped Temperatures: వణుకుతున్న తెలంగాన.. చంపేస్తున్న చలి
మృతదేహాన్ని మాయం చేసేందుకు కత్తెరతో శరీరాన్ని రెండు భాగాలుగా చేసి సూట్ కేసులో పెట్టి అతడి మేనల్లుడితో కలసి మృతదేహాన్ని బైక్ పై పెట్టుకుని యాదవోలు, చిన్నాయగూడెం మీదుగా యర్నగూడెం శివారు పోలవరం కుడి కాలువలో రెండు వేరు వేరు చోట్ల పడేశాడు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్ళిపోయాడు.. రెండు రోజుల తర్వాత గోపాలపురం పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడం లేదంటూ అతని తల్లితో కలసి వెళ్లి ఫిర్యాదు చేశాడు..
పోలిసులు విచారణ వేగవంతం చేయడం, అదేసమయంలో పోలవరం కాలువ వద్ద మృతదేహం లభ్యం కావడంతో భయపడిన సత్యనారాయణ వీఆర్వో వద్దకు వెళ్ళి లొంగిపోయాడు. కుటుంబ కలహాల నేపద్యంలో భార్యను హత్యచేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ మీడియాకు వివరించారు. హత్యకేసుతో సంబంధం ఉన్న మృతురాలి భర్త ముమ్మిడి నాగరాజు, అత్త ముమ్మిడి ధనలక్ష్మి తో పాటు మేనల్లుడు గొన్నూరి సూరిబాబులను అరెస్ట్ చేయడంతో పాటు హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు డీఎస్పీ శ్రీనాథ్.
Read Also: Women Crime: ఖతర్నాక్.. బట్టల దుకాణంలో మహిళల హల్ చల్
తాజావార్తలు
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!