Yarapathineni Srinivasa Rao: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yarapathineni Srinivasa Rao Sensational Comments On YS jagan Mohan Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పిడుగురాళ్ల పట్టణంలో నిర్వహించిన బీసీ శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. గతంలో అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన బాంబు దాడి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ దాడిలో కారు 20 అడుగులు పైకి లేచి కిందపడినా చంద్రబాబు బతికారని, అదీ ఆయన మంచితనమని పేర్కొన్నారు. కానీ.. రాజశేఖర్ రెడ్డికి పావురాళ్లు గుట్టలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో గుర్తుందా? అని ప్రశ్నించారు. అదే గతి నీక్కూడా పడుతుంది.. గుర్తు పెట్టుకో జగన్ అని హెచ్చరించారు.
ఈ మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో గురజాల నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా.. విధ్వంసకాండ, ఫ్యాక్షన్ హత్యలకు తెరలేపారని యరపతినేని ఆరోపణలు చేశారు. 9 మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, కాపు నాయకులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. ఇసుక, నిత్యవసర సరుకులు, విద్యుత్ చార్జీలు పెంచి.. సామాన్యుల నడ్డీ విరిచారని మండిపడ్డారు. బీసీలు ఎన్టీఆర్ వెంట నడిచి కేంద్ర మంత్రులయ్యారని చెప్పారు. కానీ మీరు మాత్రం బీసీలపై ధృతరాష్ట్రుడి ప్రేమ చూపిస్తున్నారని, పైకి మాత్రం బీసీ కులస్తులకు మాత్రమే న్యాయం చేస్తున్నామని మాయమాటలు చెప్తున్నారంటూ జగన్పై విరుచుకుపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల వద్దకు వెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదని.. ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర సంవత్సరాలు ఉండగానే బీసీ శంఖారావం మొదలుపెట్టామని చెప్పారు.
Also Read
- YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
- CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
- DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
మార్కెట్ యార్డ్ నిధుల ద్వారా ఒక్క రోడ్డు గానీ, రైతులకు నిధులు గానీ కేటాయించలేదని యరపతినేని విమర్శించారు. వైయస్సార్సీపి బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వచ్చి గ్రామంలో సభ పెట్టుకుంటుంటే.. పిడుగురాళ్ల ఆఫీసులో ఉండి ఆ సభకు ఎవరు వెళ్లకూడదని ఉక్కును చారి వచ్చేసింది నువ్వు కదా? అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఎస్పీకి ఒక హెచ్చరిక కూడా చేశారు. మీ ఎస్ఐలను కంట్రోల్లో పెట్టుకోవాలని.. లేకపోతే పోలీస్ స్టేషన్లో 30 మంత్రి పోలీసులుంటే, గ్రామంలో 35 వేల మంది ఉంటారని వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జరగరానిది ఏదైనా జరిగితే.. దానికి బాధ్యత మీదేనని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
-
Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!