తిరుపతిలో ప్రేమ పేరుతో మూడో పెళ్ళి చేసుకొని ఆరు లక్షలు దోచుకొని పరారయ్యింది మహిళ. దాంతో పోలీసులను ఆశ్రయించాడు చిత్తూరు జిల్లా విజయపురంకి చెందిన బాధితుడు. గత ఐదేళ్ళుగా తిరుపతి లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో కంపెనిలో పనిచేస్తున్నాడు యువకుడు. అదే కంపెనీలో పనిచేస్తు అనాథనాని యువకుడికి దగ్గరైంది సుహాసిని. ఆ తర్వాత పెళ్ళి చేసుకుందామని ఆరు లక్షల వసూళ్ళు చేసి నెమ్మదిగా పరారయ్యింది సుహాసిని. తాను మెసపోయినట్లు తెలుసుకుని యువకుడు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఖిలాడి లేడీని వెతికే పనిలో పడ్డారు.