Petrol Rates: రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ ధరలు తగ్గిస్తాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో లీటర్ పెట్రోలుపై రూ.9.50, లీటర్ డీజిల్పై రూ.7 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో లీటరు పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49గా ఉండగా.. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.120, లీటర్ డీజిల్ రూ.105.65గా ఉన్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ.110కి దిగివచ్చే అవకాశముంది. అటు లీటర్ డీజిల్ ధర రూ.100 కంటే తక్కువకే దొరకనుంది.
Big news: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
అయితే కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు ఎక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ట్యాక్సులు తగ్గిస్తే వాహనదారులపై భారం తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు. గత ఏడాది నవంబరు నెలలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ఊరట కలిగింది. అప్పుడు లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్పై రూ.10 సుంకాన్ని కేంద్రం తగ్గించింది. అనంతరం బీజేపీ పాలిత రాష్ట్రాలు వరుసగా పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాయి. అప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం వ్యాట్ను తగ్గించేందుకు విముఖత వ్యక్తం చేశాయి. మరి ఇప్పుడైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించి ప్రజలకు ఊరట కలిగిస్తాయో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!