Wife Protests at Husbands Home: భర్త కోసం భార్య అలుపెరుగని పోరాటం
భర్త కాపురానికి రానివ్వట్లేదని, తన భర్త తనకు కావాలని ఓ ఇల్లాలు కర్నూలు జిల్లాలో భర్త ఇంటి ముందు పోరాటానికి దిగింది. ఉన్నత విద్య చదివిన తనపై పిచ్చి పట్టిందనే ముద్ర వేసి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ ఇల్లాలు వారం రోజులపాటు భర్త ఇంటి ముందే ఒంటరి పోరాటం చేస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం లొద్దిపల్లి లో బెల్లం విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి ముందు వారం రోజులుగా భర్త కోసం పోరాటం చేస్తోంది. నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవాయికి చెందిన ఉమామహేశ్వరికి 2017 లొద్దిపల్లికి చెందిన బెల్లం విష్ణువర్ధన్ రెడ్డితో వివాహమైంది. పెళ్లి సందర్భంగా 30 లక్షల రూపంలో కట్నకానుకలు ఇచ్చారు.
విష్ణువర్ధన్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. అయితే పెళ్లయిన రెండు వారాలకే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలొచ్చాయి. పుట్టింటికి వెళ్లిన ఉమామహేశ్వరిని తిరిగి భర్త ఇంటికి కాపురానికి పంపేందుకు పెద్దనుషుల ద్వారా ప్రయత్నించారు. ఒక దశలో పోలీసులు పంచాయతీ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశారు. మరో వైపు విడాకులు కావాలంటూ భర్త విష్ణువర్ధన్ రెడ్డి కోర్టు నోటీస్ ఇచ్చారు. భర్త విడాకులు తనకు వద్దంటూ భర్తే కావాలంటూ ఉమా మహేశ్వరి లొద్దిపల్లిలో భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. భర్త ఇంట్లోకి వెళ్లి 5 రోజులు స్వీయనిర్బంధంలో ఉంది. కోడలు ఇంట్లోకి రావడంతో అత్త, మామలు బెల్లం సుధాకర్ రెడ్డి, యశోధమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
Minister Jagadish Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అక్కడ కరెంట్ సరఫరా కూడా నిలిపివేశారు. ఎవరో ఏదో ఒక పూట ఇంత అన్నం పెడితే తిని వారం రోజులుగా భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు పిచ్చి పట్టిందని ప్రచారం చేసి వదిలించుకోవాలని చూస్తున్నారని, ఇద్దరితో కాపురం చేస్తుందంటూ అక్రమ సంబంధం అంటగట్టే ప్రయత్నం చేసారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తాను భర్తతో కాపురం చేయాలని కోరుకుంటున్నానని, డబ్బులు , ఆస్థులు అవసరం లేదంటుంది ఉమామహేశ్వరి. తనకు న్యాయం చేయాలని , అప్పటి వరకు నా పోరాటం ఆగదని చెబుతుంది ఉమామహేశ్వరి.
ఉమా మహేశ్వరి ఆందోళనపై అత్త యశోద వాదన భిన్నంగా ఉంది. పెళ్లయిన కొత్తలోనే కాపురం చేయకుండా వెళ్ళిపోయి తమపై లేనిపోని కేసులు పెట్టిందని ఆరోపిస్తోంది ఉమామహేశ్వరి అత్త యశోద. తన కుమారుని కేసులతో వేధించారని, విసుగుచెంది భార్య వద్దని విడాకులు కోరుతున్నారని చెబుతోంది. ప్రతిసారి పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తున్నారని చెబుతోందామె. మొత్తమ్మీద లొద్ధిపల్లిలో భర్త కోసం ఉమామహేశ్వరి పోరాటం చర్చనీయాంశమైంది. విష్ణువర్ధన్ రెడ్డి తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.
తాజావార్తలు
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!