Wife Protests at Husbands Home: భర్త కోసం భార్య అలుపెరుగని పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్త కాపురానికి రానివ్వట్లేదని, తన భర్త తనకు కావాలని ఓ ఇల్లాలు కర్నూలు జిల్లాలో భర్త ఇంటి ముందు పోరాటానికి దిగింది. ఉన్నత విద్య చదివిన తనపై పిచ్చి పట్టిందనే ముద్ర వేసి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ ఇల్లాలు వారం రోజులపాటు భర్త ఇంటి ముందే ఒంటరి పోరాటం చేస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం లొద్దిపల్లి లో బెల్లం విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి ముందు వారం రోజులుగా భర్త కోసం పోరాటం చేస్తోంది. నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవాయికి చెందిన ఉమామహేశ్వరికి 2017 లొద్దిపల్లికి చెందిన బెల్లం విష్ణువర్ధన్ రెడ్డితో వివాహమైంది. పెళ్లి సందర్భంగా 30 లక్షల రూపంలో కట్నకానుకలు ఇచ్చారు.
విష్ణువర్ధన్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. అయితే పెళ్లయిన రెండు వారాలకే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలొచ్చాయి. పుట్టింటికి వెళ్లిన ఉమామహేశ్వరిని తిరిగి భర్త ఇంటికి కాపురానికి పంపేందుకు పెద్దనుషుల ద్వారా ప్రయత్నించారు. ఒక దశలో పోలీసులు పంచాయతీ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశారు. మరో వైపు విడాకులు కావాలంటూ భర్త విష్ణువర్ధన్ రెడ్డి కోర్టు నోటీస్ ఇచ్చారు. భర్త విడాకులు తనకు వద్దంటూ భర్తే కావాలంటూ ఉమా మహేశ్వరి లొద్దిపల్లిలో భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. భర్త ఇంట్లోకి వెళ్లి 5 రోజులు స్వీయనిర్బంధంలో ఉంది. కోడలు ఇంట్లోకి రావడంతో అత్త, మామలు బెల్లం సుధాకర్ రెడ్డి, యశోధమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
Minister Jagadish Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అక్కడ కరెంట్ సరఫరా కూడా నిలిపివేశారు. ఎవరో ఏదో ఒక పూట ఇంత అన్నం పెడితే తిని వారం రోజులుగా భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు పిచ్చి పట్టిందని ప్రచారం చేసి వదిలించుకోవాలని చూస్తున్నారని, ఇద్దరితో కాపురం చేస్తుందంటూ అక్రమ సంబంధం అంటగట్టే ప్రయత్నం చేసారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తాను భర్తతో కాపురం చేయాలని కోరుకుంటున్నానని, డబ్బులు , ఆస్థులు అవసరం లేదంటుంది ఉమామహేశ్వరి. తనకు న్యాయం చేయాలని , అప్పటి వరకు నా పోరాటం ఆగదని చెబుతుంది ఉమామహేశ్వరి.
ఉమా మహేశ్వరి ఆందోళనపై అత్త యశోద వాదన భిన్నంగా ఉంది. పెళ్లయిన కొత్తలోనే కాపురం చేయకుండా వెళ్ళిపోయి తమపై లేనిపోని కేసులు పెట్టిందని ఆరోపిస్తోంది ఉమామహేశ్వరి అత్త యశోద. తన కుమారుని కేసులతో వేధించారని, విసుగుచెంది భార్య వద్దని విడాకులు కోరుతున్నారని చెబుతోంది. ప్రతిసారి పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తున్నారని చెబుతోందామె. మొత్తమ్మీద లొద్ధిపల్లిలో భర్త కోసం ఉమామహేశ్వరి పోరాటం చర్చనీయాంశమైంది. విష్ణువర్ధన్ రెడ్డి తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!