అనంతపురం జిల్లాలోని హిందూపురంలో నేడు ఎమ్మెల్యే బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తో బాలకృష్ణ మౌన దీక్షకు దిగనున్నారు. ఈ సందర్బంగా పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.
నేడు అమరావతిలో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై స్టీరింగ్ కమిటీ చర్చించనుంది.
నేడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. అయితే గోరఖ్ పూర్ నుంచి యూపీ సీఎం యోగి పోటీ చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు మూడో రోజు జరుగనున్నాయి. అంతేకాకుండా రేపు సహస్రాబ్ది వేడుకలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు.
హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,100 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,200లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.61,400లుగా ఉంది.