Off The Record: ఐదేళ్ల పాటు ఆ ఎమ్మెల్సీ ఆడిందే ఆట.. పాడిందే పాట.. ఇప్పుడు ఆయన ఆచూకీ లేదు..
- వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం టీడీపీకి ఇబ్బందులు..
- అంతకంటే దారుణమైన స్థితిలో ప్రస్తుతం కుప్పం వైసీపీ..
- ప్రస్తుతం కుప్పం వైసీపీకి నాయకుడెవరు?..
- నాడు పెత్తనం చేసిన ఎమ్మెల్సీ భరత్ కోసం కేడర్ వెదుకులాట..
- ఇప్పుడే కదా.. అండ కావాల్సింది అంటున్న కార్యకర్తలు..
- కుప్పం మీద వైసీపీ దృష్టిపెట్టిన క్రమంలో భరత్కు ఎమ్మెల్సీ..
- గెలిపిస్తే భరత్ను మంత్రిని చేస్తానంటూ నాడు జగన్ ప్రకటన..
- 2024 ఫలితాల తర్వాత అడ్రస్లేని కుప్పం వైసీపీ నేతలు..
- కేరాఫ్ బెంగళూర్ అన్నట్టుగా కీలక నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కుప్పం పాలిటిక్స్ అంటే.. కేరాఫ్ సీఎం చంద్రబాబు నాయుడు. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… ఆయన అడ్డా అది.1989 నుంచి మొదలుపెట్టి ఇప్పటి దాకా ఓటమి ఎరగని నేతగా అక్కడ కొనసాగుతున్నారాయన. అలాంటి చోట 2019 ఎన్నికల తర్వాత పెద్ద జర్క్ వచ్చింది. ఇక కుప్పంలో టీడీపీ పని అయిపోయిందన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకేళ్ళే ప్రయత్నం చేసింది వైసీపీ. కట్ చేస్తే… ఇప్పుడు అదే పార్టీ అదే గడ్డ మీద క్లిష్టపరిస్థితుల్లో ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కుప్పం నుంచే 2024లో మళ్ళీ గెలిచి చంద్రబాబు సీఎం సీట్లో కూర్చుంటే…. నియోజకవర్గంలో వైసీపీకి నాయకుడు లేని పరిస్థితి దాపురించిందని చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పెత్తనం చెలాయించిన ఎమ్మెల్సీ భరత్ ఏమైపోయారంటూ పార్టీ కేడర్ కాగడాలు పెట్టి వెదుకుతోందట. గడిచిన ఏడాదిన్నరలో ఆయన రెండు మూడు సార్లు తప్ప నియోజకవర్గం ముఖం చూడకపోవడం, అధికారం ఉన్నప్పుడు మా అంతటి వాళ్ళు లేరన్నట్టు బిల్డప్లు ఇచ్చిన కొందరు స్థానిక నాయకులు కూడా సైలెంట్గా సైడైపోవడంతో…. ఏం చేయాలో అర్ధంగాక దిక్కులు చూస్తోందట కేడర్.
సిసలైన నాయకులంటే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా అండగా నిలబడాలి. మరి వీళ్ళంతా ఇప్పుడిలా ముఖం చాటేస్తే… మన సంగతేంటంటూ తమలో తాము ఫీలవుతున్నారట కుప్పం వైసీపీ కార్యకర్తలు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పం విషయంలో చాలా పెద్ద స్కెచ్చే వేసింది వైసీపీ అధిష్టానం. అప్పటి స్థానిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించడంతో… ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని గట్టిగా ప్రచారం చేశారు వైసీపీ నాయకులు. నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా కుప్పం మీదే గట్టిగా దృష్టి పెట్టారు. అదే టైంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న భరత్కు అనూహ్యంగా ఎమ్మెల్సీ దక్కింది. తర్వాత ఆయన్ని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిని చేశారు. నాటి సీఎం జగన్ కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ…. ఈసారి భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ స్వయంగా చెప్పేవారు. వై నాట్ 175 నినాదాన్ని కూడా కుప్పం నుంచే మొదలెట్టారు జగన్. ఎన్నికలకు ముందు హంద్రీనీవా నీటిని విడుదల చేయడం, 65 కోట్ల నిధులతో పనులు ప్రారంభించడం లాంటి కార్యక్రమాలతో కుప్పంలో ఏదో జరిగిపోతోందంటూ ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించింది వైసీపీ. దీనిద్వారా….. చంద్రబాబు డిఫెన్స్లోపడి సొంత నియోజకవర్గం మీదే ఎక్కువగా దృష్టి పెడతారని, తాము మిగిలిన చోట్ల బాగా లాభపడవచ్చని అప్పట్లో వైసీపీ వ్యూహంగా చెప్పుకున్నారు.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఒకటైంలో… చంద్రబాబు నియోజకవర్గంలోకి ఎంటర్ అవకుండా… అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆ సందర్భంగా గొడవలు అవడంతో అక్కడ అసలేం జరుగుతోందన్న టెన్షన్ అప్పట్లో ఉండేది. కట్ చేస్తే…. గత ఎన్నికల్లో ఆ పాచికలేవీ పారలేదు. ఇక్కడ వైసీపీ ఎత్తులన్నీ చిత్తవగా….. ఫలితాల తర్వాత టీడీపీ నాయకులు దూకుడు పెంచడంతో…. కుప్పం వైసీపీ నాయకులు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొందరు సైకిలెక్కితే… ఇంకొందరు చెల్లాచెదురయ్యారు. కీలకమైన నియోజకవర్గ నాయకులు,
మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. కుప్పం వైసీపీలో కీలక నేతలైన విద్యాసాగర్, సెంథిల్ కూమార్ లాంటి వాళ్ళు కేరాఫ్ బెంగళూర్ అని చెప్పుకుంటున్నారు. అప్పట్లో మాటకు ముందు కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని సవాల్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి సైతం ఇప్పుడు అటువైపు వెళ్ళడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కేడర్కు అండగా ఉండాల్సిన నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ మాత్రం నాకేం సంబంధం లేదనట్టు హైదరాబాద్, బెంగుళూరు ట్రిప్స్తో టైంపాస్ చేస్తున్నారన్నది స్థానిక కార్యకర్తల ఆవేదన. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి నిరసనగా ఇటీవల నిర్వహించిన సంతకాల సేకరణను సైతం ఆయన పట్టించుకోకపోవడంతో కార్యకర్తలే మమ అనిపించినట్టు తెలిసింది.
సార్…. రాకపోతే పోయారు…. కనీసం మా మీద పెడుతున్న కేసుల గురించి అయినా పట్టించుకోవాలి కదా? మా బాధలు చెప్పుకోవడానికి ఫోన్లు కూడా తీయకపోతే ఎలాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది కేడర్. అప్పుడేమో… మీకెందుకు నేనున్నానని భరోసా ఇచ్చి రెచ్చగొట్టి… తీరా ఇప్పుడు కేసులు పడుతుంటే కనీసం మాటవరసకి కూడా నేనున్నానని చెప్పకుండా గాలికి వదిలేశారన్నది కుప్పం వైసీపీ కేడర్ ఆవేదన. ఒకవేళ పొరపాటున ఫోన్ ఎత్తినా… చూసుకోండి ఇంకా టైం ఉంది కదా… మళ్లీ మాట్లాడదాం అంటూ సైలెంట్ గా తప్పించుకుంటున్నారట ఎమ్మెల్సీ భరత్. పరిస్థితి ఇలానే ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు కూడా ఇంతే ఉంటాయంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు కార్యకర్తలు. సీఎం నియోజకవర్గం విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్