Karumuri Nageswara Rao: ప్రధాని మోడీ ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ, పవన్కి చాక్లెట్ ఇచ్చారు..!
- పవన్ కల్యాణ్ కు ప్రధాని మోడీ చాక్లెట్ ఇవ్వడంపై కారుమూరి సెటైర్లు..
- మొన్న వచ్చినప్పుడు నీరు - మట్టి తీసుకొచ్చారు..
- ఈసారి ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ, డిప్యూటీ సీఎంకు చాక్లెట్ ఇచ్చారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao: ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న ప్రధాని మోడీ అమరావతికి వచ్చారని గుర్తుచేశారు.. అయితే, మొన్న వచ్చినప్పుడు (అమరావతి శంకుస్థాపనకు తొలిసారి వచ్చినప్పుడు) నీరు – మట్టి తీసుకొచ్చారు.. ఈసారి (అమరావతి రీలాంచ్) ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కి చాక్లెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.
Read Also: CPI Narayana: అమరావతి పనులపై నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ బాధ్యత మోడీదే..!
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
ఇక, సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్.. రైతు దగ్గర నుంచి ప్రతి ధాన్యం గింజ కూడా కొనాలని డిమాండ్ చేశారు కారుమూరి.. అలా కొనని పక్షంలో రైతులు వెంట ఉండి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.. రైతులకు చిరిగిపోయిన సంచులు ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి.. చిరిగిపోయిన సంచలిచ్చి రైతులకు ఏమి చేస్తారు అని మండిపడ్డారు మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరావు.. కాగా, అమరావతిలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కి ప్రధాని మోడీల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకున్న విషయం విదితమే.. సభా వేదికపై ముఖ్య నేతలందరూ కూర్చొని ఉండగా.. ప్రధాని మోడీ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దగ్గరకు పిలవడంతో.. పవన్ హడావిడిగా ఆయన దగ్గరికి వెళ్లారు.. తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న చాక్లెట్ ను తీసి పవన్ కల్యాణ్కు ఇవ్వడంతో వేదికపై ఉన్న వారితో పాటు, సభ ప్రాంగణంలో ఉన్న వారి మధ్య నవ్వులు పూసాయి.. చాక్లెట్ ఇచ్చిన తర్వాత.. మొదట ప్రధాని, సీఎం చంద్రబాబు నవ్వారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా చేతిలో ఉన్న చాక్లెట్ ను చూసి వారితో కలిసి నవ్వేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!