RK Roja: పవన్ కళ్యాణ్కు ఓట్లేసింది సినిమా షూటింగులు చేసుకోవడానికా..?
- పవన్ కళ్యాణ్కు ఓటేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు..
- కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు తప్పు చేసిన పవన్ నిలదీయాలి..
- పవన్ కళ్యాణ్కు ఓట్లేసింది సినిమా షూటింగులు చేసుకోవడానికా?: ఆర్కే రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీయే కూటమీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సూపర్ సిక్స్- సూపర్ హిట్ కాదు సూపర్ ప్లాప్ అది.. అబద్దాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించింది. చంద్రబాబు, పవన్ రెండేళ్ళ రాష్ట్ర సంపదను దోచుకుని ప్రజలకు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని పేర్కొనింది. మంత్రులు చూపించిన మెడికల్ కాలేజీల వీడియోలు ఫేక్ అని ఆర్కే రోజా విమర్శలు గుప్పించింది.
Read Also: PM Modi: మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్ను ప్రారంభించిన మోడీ
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
ఇక, సినిమా షూటింగులు చేసుకోవడానికి కాదు పవన్ కళ్యాణ్ కి ప్రజలు ఓట్లు వేసింది అని వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫైట్ లో తిరగడానికి కాదు పవన్ కు ఓట్లు వేసింది.. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలను జనసేనా అధినేత పట్టించుకోకుండా ఫ్యాకేజీలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నాడని విమర్శించింది. బుర్ర ఉన్న యదవ ఎవడు మెడికల్ కాలేజీల విషయంలో మద్దతు ఇవ్వడు.. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం తల ఆడించాడని ఎద్దేవా చేసింది. ఇక, పవన్ కళ్యాణ్ కు ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారు అని మాజీ మంత్రి రోజా తెలిపింది.
Read Also: Charlie Kirk: చార్లీ కిర్క్ హంతకుడు ఎలా దొరికాడు.. ఎఫ్బీఐ సాధించిందేమీ లేదా?
అయితే, మంత్రులు వస్తే మెడికల్ కాలేజీలు చూపిస్తామని ఆర్కే రోజా సూచించింది. హోంమంత్రి అనిత మెడికల్ కాలేజ్ విషయంలో చూపించింది ప్రజెంటేషన్ కాదు ఫ్రస్టేషన్ అన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఫేక్ వీడియోలతో మంత్రులు మెడికల్ కాలేజీల విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొత్త పిచ్చోడో పొద్దెరగడు అన్నట్లుగా మంత్రి పదవి రాగానే సవిత పని చేస్తోంది.. నాలుగుసార్లు సీఎంగా ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ చంద్రబాబు కట్టలేదు.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడింది. మెడికల్ కాలేజీలను అనుమతులు ఎలా వస్తాయో కూడా మంత్రులకు తెలియదు.. లోకేష్, చంద్రబాబు మెప్పు కోసం సిగ్గులేకుండా మంత్రులు అబద్దాలు చేబుతున్నారు.. జగన్ బెంగుళూరులో ఉంటే టీడీపీ, జనసేన ఓడిపోయినప్పుడు ఎక్కడ ఉన్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!