Vizianagaram: గుర్లలో అదుపులోకొచ్చిన డయేరియా.. తాగునీటి కాలుష్యం వల్లే వ్యాధి
- విజయనగరం జిల్లా గుర్లలో అదుపులోకొచ్చిన డయేరియా
- ఈనెల 13 నుండి 15వరకు పెరిగిన డయేరియా కేసులు
- గత నాలుగు రోజులుగా కేసుల నమోదులో భారీ తగ్గుదల
- శనివారం నాడు నమోదయ్యింది ఒక్క కేసు మాత్రమే
- డయేరియా వల్ల మరణించింది ఒక్కరే అని నివేదిక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక వైద్య సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా అదుపులోకొచ్చిందని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన వివరాలను అందించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు.. డయేరియా ప్రబలిన వెంటనే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతిని విజయనగరం జిల్లాకు పంపించామన్నారు. ఆమె అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్థానిక వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, డయేరియా వ్యాప్తికి గల కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేసిందని తెలిపారు. ఆ గ్రామంలో తాగునీటి నమూనాలను ప్రయోగశాలకు పంపించగా.. కలుషితమైనట్లు తేలిందని కృష్ణబాబు చెప్పారు. ఆ ప్రాంతంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడం వల్ల భూగర్భ జలం కలుషితమయ్యిందని.. నీటిని సరఫరా చేసే పైపులు డ్రైనేజీ వ్యవస్థలో ఉండడం వల్ల లీకేజీ వలన కూడా తాగునీరు కలుషితమయ్యిందని స్థానిక అధికారులు వివరించారు.
Unstoppable 4 -NBK: అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో ఫస్ట్ గెస్ట్గా సీఎం చంద్రబాబు.. ప్రసారం ఎప్పుడంటే?
Also Read
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
- Vizianagaram Incident: యువకుడి వికృత చేష్టలు.. నిండు గర్భిణీ ఇంటి ముందు అసభ్య ప్రవర్తన..!
డీహైడ్రేషన్ బాగా ఉన్న డయేరియా కేసుల్ని చీపురుపల్లి సిహెచ్ సికి, విజయనగరం జిజిహెచ్, వైజాగ్ కేజిహెచ్ లకు తరలించారని.. ఇంటింటికీ సర్వే చేసి అనుమానిత కేసుల్ని ఉచిత వైద్య శిబిరాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారని కృష్ణబాబు పేర్కొన్నారు. పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టు, ఎపిడిమాలజిస్ట్, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ నిపుణులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆప్రాంతంలో సమగ్ర సర్వే చేసి నివేదికను పంపించాలని కృష్ణబాబు ఆదేశించారు. నీరు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన నీరు అందజేస్తున్నట్లు తెలిపారు.
Sanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ‘‘రాష్ట్రపతి పాలన’’.. అమిత్ షాపై సంచలన ఆరోపణలు..
ఈనెల 13న ఒక కేసుతో డయేరియా కేసులు మొదలు కాగా.. 14న 55 కేసులు, 15న 65 కేసులు నమోదయ్యాయి. 16న 40 కేసులు, 17న 32 కేసులు, 18న 8 కేసులు నమోదుతో కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం నాడు ఒక్క కేసే నమోదయ్యింది. 53 మంది ప్రస్తుతం చికిత్స పొందుతుండగా.. వారిలో గుర్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో 17 మంది, వైజాగ్ కేజీహెచ్, జీజీహెచ్ విజయనగరం, ఘోషా ఆసుపత్రి, సీహెచ్సీ చీపురుపల్లిలలో 36 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు గుర్లలో డయేరియా వ్యాధి వల్ల చనిపోయిన వారి సంఖ్య గురించి వివిధ రకాల వార్తలొస్తున్నాయని.. కానీ వాస్తవంగా గుర్ల మండలంలో డయేరియా వలన ఒక్కరు మాత్రమే చనిపోయారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. ఏడుగురు ఇతర వ్యాధులతో మరణించారని.. స్థానికంగా పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్న పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుకు నివేదిక పంపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!