Botsa Satyanarayana: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది..
- రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది..
- రైతులు బ్లాక్ మార్కెట్లో ఎరువులు కొని పంటలు పండించాల్సిన పరిస్థితి..
- పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయారు..
- కూటమి ప్రభుత్వం రైతుల్ని ఆదుకునే దాఖలాలు కనపడలేదు..
- రైతులకు ఎప్పుడు సాయం చేస్తారో కూటమి నేతలు చెప్పాలి: బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రైతులు గానీ, రైతు కూలీలు పంటకు కావాల్సిన ఎరువుల కోసం ఎంతలా కొట్లాడారో చూశాం.. బ్లాక్ మార్కెట్ లో ఎరువులు కొనుక్కొని పంట పండించిన పరిస్థితి ఏర్పడింది.. ఆ పంట చేతికొచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు వల్ల నష్టపోయారు.. ప్రభుత్వం ఎక్కడ రైతులను ఆదుకున్న దాఖలాలు కనపడలేదని ఎద్దేవా చేశారు. చేతికొచ్చిన పంటను అమ్ముకుందాం అనుకుంటే గత ఏడేనిమిది ఏళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు.. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు.. అరటి, మొక్క జొన్న, పొగాకు, ప్రత్తి ఏ పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చెరుకుకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట వేసుకుంటున్నారు.. గత ప్రభుత్వ హయాంలో పంటకు కొనుగోలులో ఇబ్బందులు వస్తే వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసిందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Putin- Modi Meeting: భారత పర్యటనకు రష్యా అధినేత.. పుతిన్ పర్యటనతో మరిన్ని ఒప్పందాలు?
Also Read
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది'
అయితే, నేటి ప్రభుత్వ హయాంలో రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని మాజీ మంత్రి బొత్స అన్నారు. రైతులు నష్టపోతుంటే కేంద్రానికి లేఖలు రాయడం ఏమిటి? అని ప్రశ్నించారు. రైతులు మొదట నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. ఆ తర్వాత కేంద్రానికి లేఖలు రాసి రియంబర్స్మెంట్ పొందాలని తెలిపారు. ఇది ఆనాదిగా వస్తున్న వ్యవహారం.. కానీ, నేడు అలాంటి పరిస్థితి లేదు.. ప్రతిపక్షంలో మేము ప్రశ్నిస్తుంటే రాజకీయం చేస్తున్నామని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. మా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు.. మొక్క జొన్నకు సంబంధించిన కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు.. ఇప్పటికే రైతులు బక్కచిక్కుపోతున్న సమయంలో రైతుల మీద ఎందుకు ఇంత చిన్న చూపులు, ఎందుకు అలసత్వం అని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: Rohit Sharma: వరల్డ్ రికార్డ్ ముందు రోహిత్ శర్మ.. ఇక మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు!
ఇక, వ్యవసాయ శాఖ మంత్రి ఆలోచించాలి, మీరు ఈ ప్రాంతానికి చెందిన వారే కదా అని ఎమ్మెల్సీ సత్యనారాయణ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతులన్నా, రైతు సమస్యలన్న అక్కర్లేదు.. ఎంత సేపు పెద్ద పెద్ద వాటి కోసమే ఆలోచిస్తుంటారు.. విశాఖలో ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి.. రూపాయికి ఇచ్చేద్దామని ఆలోచనలోనే ఉంటారు.. బ్యాక్ డోర్ లో ఏ విధంగా దోచుకుని తిందామనే ఆలోచన తప్ప మరి ఇంకేం లేదని విమర్శించారు. రైతులకు కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?.. ఇప్పటికే 70 నుంచి 80 శాతం వరకు ప్రైవేట్ మార్కెట్లలో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది.. వ్యవసాయ స్థితిగతులు మారాలని బొత్స సత్యనారాయణ అన్నారు.
తాజావార్తలు
-
TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ఎఫెక్ట్… ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
-
Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
-
Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
-
CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!