Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Emotional: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి కన్నీటి పర్యంతం అయ్యారు.. విజయనగరం నగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు హాజరయ్యారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిన్న శ్రీను పార్టీ మార్పుతో ప్రాధాన్యత
ఇటీవల చిన్న శ్రీను పార్టీ మారిన నేపథ్యంలో విజయనగరం జిల్లా వైసీపీ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపై సమావేశంలో పలువురు నేతలు స్పందించారు. పార్టీకి అండగా నిలవాలని, కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా కార్యకర్తలు బొత్స 2.0 కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ రాజకీయ పార్టీ ఏర్పాటు సమయంలో నాయకులను మాత్రమే నమ్మలేదని, వైఎస్సార్ అభిమానులు, ప్రజలను నమ్మి పార్టీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబుకు కుటుంబాలను విడదీసే చరిత్ర ఉందని అమర్నాథ్ విమర్శించారు. అయితే బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని మాత్రం ఎవరూ టచ్ చేయలేరని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ తిరిగే అధికారులపై వ్యాఖ్యలు చేస్తూ.. ప్రస్తుతం లోకేష్ చుట్టూ ఐఏఎస్ అధికారులు తిరుగుతున్నారని, భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చని వ్యాఖ్యానించారు.
Also Read
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
- Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
బొత్స ఓ రాజకీయ విశ్వవిద్యాలయం
ఇక, బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వవిద్యాలయమని గుడివాడ అమర్నాథ్ అభివర్ణించారు. ఆయన ఎంతోమందిని సర్పంచుల స్థాయి నుంచి ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దిన చరిత్ర ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు బొత్సకు అండగా నిలవాలని సూచించారు. ఇదే సమయంలో.. సమావేశంలో చిన్న శ్రీను పార్టీ మారిన అంశంపై గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతుండగా బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో సమావేశంలో కొంతసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
భావోద్వేగానికి గురైన బడ్డుకొండ అప్పలనాయుడు
ఇదే సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తన బావమరిది చిన్న శ్రీను పార్టీ మారడం, దాని ప్రభావం తనపై పడుతుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదగడానికి దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అందించిన సహకారం కారణమని బడ్డుకొండ అప్పలనాయుడు గుర్తుచేశారు. వారికి అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!