Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలక పరిణామాలు.. భేటీకి ముందే చర్యలు..
- విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేగంగా మారుతున్న పరిణామాలు..
- నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వశాఖ కీలక భేటీ..
- సమావేశం కంటే ముందే కీలక చర్యలు..
- స్టీల్ ప్లాంటు సీఎండీగా ఉన్న అతుల్ భట్ విధుల నుంచి తొలగింపు..
- రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశాలు..
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేగంగా మారుతున్నాయి పరిణామాలు.. నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వశాఖ కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశం కంటే ముందే కీలక చర్యలకు దిగింది సర్కార్.. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సీఎండీగా ఉన్న అతుల్ భట్ను విధుల నుంచి తప్పించింది.. ఆయన రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ప్రస్తుతం వున్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది.. కాగా.. ప్లాంట్ ప్రయివేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే నిర్ణయాలు మాత్రం అమలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి.. ప్లాంట్ లో తాజాగా ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలైన పరిణామాలు కనిపించాయి.. దీంతో, ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతుందని కార్మిక సంఘాలో ఆరోపిస్తున్నాయి.. 19 వేల పైచిలుకున్న స్టీల్ కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 8 వేలకు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోందని కొందరు అంచనా వేస్తున్నారు.. ఇది ఉత్పత్తిపై తీవ్ర దుష్ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.. అయితే, ఇప్ఉడు సీఎండీని తప్పించడం వెనుక ప్రభుత్వ వ్యూహం ఏంటి అనేది వేచిచూడాల్సిన అంశంగా ఉంది.. ఈ రోజు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Haryana Elections: కాంగ్రెస్-ఆప్ మధ్య చెడిందా..? ఆ రాష్ట్రంలో రెండు పార్టీలు ఒంటరిగా పోటీ..
Also Read
మరోవైపు.. విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించిన కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి.. 45 రోజుల్లో అన్నీ చక్కదిద్దబడతాయని, ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రశ్నేలేదని ప్రకటించిన విషయం విదితమే.. కానీ, ఆ తర్వాత పరిణామాలు చూస్తే 2025 నాటికి 2500 మందికి వీఆర్ఎస్ పేరుతో ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైందనే చర్చ సాగింది.. ఇందుకోసం రూ.1260 కోట్లు సిద్ధం చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. నాగర్నార్ స్టీల్ప్లాంట్లో సాంకేతికంగా అనుభవజ్ఞులైన కార్మికులు లేరని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కార్మికులను పంపించాలని కేంద్రం కోరిన వెంటనే విశాఖ యాజమాన్యం 500 మందిని డిప్యుటేషన్పై పంపేయాలని నిర్ణయం చేయడం చూస్తే వైజాగ్ స్టీల్ప్లాంట్ ఖాళీ అయిపోతుందన్నది అనుమానాలు తావు ఇచ్చింది.. అయితే, ఈ రోజు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అంటూ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు..
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!