Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నాసిరకం రా మెటీరియల్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్లాంట్లో ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు దెబ్బతినడానికి నాసిరకం ముడి పదార్థాలే ప్రధాన కారణమని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్వాలిటీ పరీక్షల నిర్వహణలో అధికారులు రాజీపడ్డారనే ఆరోపణలపై యాజమాన్యం కీలక చర్యలు చేపట్టింది. ఒకేసారి 22 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య స్టీల్ ప్లాంట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
సస్పెన్షన్కు గురైన వారిలో SMS-1, SMS-2 విభాగాలతో పాటు క్యూఏటీడీ (Quality Assurance Technology Department)లో పనిచేస్తున్న సీనియర్ అధికారులు ఉన్నట్లు సమాచారం. నాణ్యత నియంత్రణలో జరిగిన లోపాలపై యాజమాన్యం తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు జనరల్ మేనేజర్లు (GMలు), నలుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు (DGMలు) బదిలీకి గురయ్యారు. బాధ్యత నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని చర్యలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
Also Read
అయితే రా మెటీరియల్ కొనుగోలు, నాణ్యత తనిఖీలు, ఉత్పత్తి ప్రక్రియలో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ జరపాలని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సీటు (SIT)తో విచారణ చేపట్టాలని కోరుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్ఠకు సంబంధించిన ఈ అంశంలో పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!