Minister Ramprasad Reddy: డీజిల్ బస్సులకు గుడ్బై.. ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే..!
- విశాఖలో ద్వారక ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీ..
- బస్టాండ్ లోనే సౌకర్యాల కోసం ప్రయాణికులను అడిగి తెలుసుకున్న మంత్రి..
- సీఎం చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది..
- స్త్రీ శక్తి పథకం కోసం apsrtc కి ప్రభుత్వం 400 కోట్లు విడుదల చేశాం..
- డీజిల్ బస్సులను ఇకపై కొనబోం.. ప్రతీ బస్సు ఎలక్ట్రిక్ బస్సులనే కొంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: డీజిల్ బస్సులకు గుడ్బై చెబుతున్నాం.. ఇకపై కొనే ప్రతి బస్సు ఎలక్ట్రిక్ బస్సే ఉంటుందన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. విశాఖ ద్వారక ఆర్టీసీ బస్టాండ్లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్లో అందిస్తున్న సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. బస్సుల లభ్యత, శుభ్రత, టికెట్ వ్యవస్థ వంటి అంశాలపై ఆయన ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా ఫ్రీ బస్సు పథకం పై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. ఈ పథకం మా కోసం చాలా ఉపయోగపడుతోంది.. ప్రతిరోజూ ఉద్యోగాలు, కళాశాలకు ప్రయాణించడానికి ఇది చాలా ఉపశమనంగా ఉంది అని మంత్రికి తెలిపారు.
Read Also: Rakshmika : క్రేజ్ తో నెగిటివిటిని కూడా కొనితెచ్చుకుంటున్న రష్మిక మందన్న
Also Read
ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం కోసం APSRTC కు ప్రభుత్వం రూ.400 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. ఈ పథకం పై తప్పుగా ప్రచారం చేసిన వారు ఇప్పుడు మౌనం వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. APSRTC ను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డీజిల్ బస్సులకు గుడ్బై చెబుతాం.. ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామన్నారు.. ఇకపై డీజిల్ బస్సులను కొనం… రాబోయే మూడు సంవత్సరాల్లో కొనబోయే ప్రతీ బస్సు ఎలెక్ట్రిక్ బస్సు మాత్రమే అన్నారు.. అంతేకాక భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏసీ బస్సులు నడిపే ఆలోచన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని తెలిపారు రాంప్రసాద్ రెడ్డి.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి..
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!