Minister Nadendla: రేషన్ బియ్యాన్ని గుర్తించేలా ర్యాపిడ్ కిట్స్..
- రేషన్ బియ్యాన్ని గుర్తించేలా ర్యాపిడ్ కిట్స్..
- పీడీఎస్ రైస్ మాఫియా ముఠాను మేం కంట్రోల్ చేయగలుగుతున్నాం..
- పీడీఎస్ బియ్యం ఎగుమతి కాకుండా కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla: విశాఖపట్నంలో పీడీఎస్ రైస్ గుర్తించే రాపిడ్ కిట్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం కాకినాడ పోర్టులో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాం.. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి మన దేశానికి చెందిన పీడీఎస్ రైస్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లో 5, 65, 000 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం.. వీటి విలువ రూ. 245 కోట్లు ఉంటుంది.. గత ప్రభుత్వంతో పోలిస్తే ఐదేళ్లలో ఇలాంటి చర్యలు వైసీపీ తీసుకోలేదన్నారు. పీడీఎస్ రైస్ ఎగుమతులపై చర్యలు చేపట్టిన తర్వాత విశాఖ పోర్టు నుంచి కూడా ఎగుమతులు జరుగుతున్నాయని గుర్తించాం.. పీడీఎస్ రైస్ మాఫియా ముఠాను మేం కంట్రోల్ చేయగలుగుతున్నాం.. మా దగ్గర ఉన్న సిబ్బందితో ఎగుమతి అవుతున్న పీడీఎఫ్ రైస్ ని పరీక్షలు జరిపి జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు.
Read Also: Trump: ఇజ్రాయెల్కు బయల్దేరేటప్పుడు భారీ వర్షం.. గొడుగుతో ఇబ్బంది పడ్డ ట్రంప్.. వీడియో వైరల్
Also Read
అయితే, విశాఖ నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతులు జరగకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి మనోహర్ పేర్కొన్నారు. విశాఖలో 33 మంది సిబ్బందితో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం.. ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న బియ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నాం.. నిఘా అధికారులు అక్రమాలకు పాడుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో అక్రమంగా ఎగుమతి చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించడానికి సిద్ధం చేసిన 700 మొబైల్ కిట్స్ ను మీడియాకు మంత్రి నాదెండ్ల మనోహర్ చూపించారు.
తాజావార్తలు
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!