Venkaiah Naidu: ఎంత కాలం బ్రతికాం అని కాదు.. ఎలా బ్రతికాం అనేది ముఖ్యం
- విశాఖలో ఆంధ్రాయూనివర్సిటీ మాజీ రెక్టార్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ 90 వసంతాల వేడుక
- ‘నవతీ ప్రసన్నం’ పేరిట కార్యక్రమం
- ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- విశిష్ఠ అతిథిగా మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో ఆంధ్రాయూనివర్సిటీ (ఏయూ) మాజీ రెక్టార్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ 90 వసంతాల వేడుక నిర్వహించారు. అంకోసా హాలులో ‘నవతీ ప్రసన్నం’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ఠ అతిథిగా మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సెంటర్ ఫర్ పాలసీ వ్యవస్థాపకులుగా, ఏయూ రెక్టార్గా, క్రికెట్, టెన్నిస్ వ్యాఖ్యాతగా ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ సేవలు ప్రశంసనీయం అని అన్నారు. ఎంత కాలం బ్రతికాం అని కాదు.. ఎలా బ్రతికాం అనేది ముఖ్యం అని వెంకయ్య నాయుడు తెలిపారు. ఆనందకర జీవితం అందరూ కోరుకుంటారు.. దానిని సాధ్యం చేసుకోవడం గొప్పదని సూచించారు. వ్యక్తి ఆలోచనకు సానుకూల ధోరణి అవసరం.. యువకులు ప్రకృతితో కలిసి జీవించాలి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. మరణించిన తరువాత జీవించాలి అంటే సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలి.. విశాఖలో తెన్నేటి విశ్వనాథం పరిచయంతో తన జీవిన శైలి మారిందని తెలిపారు. విశాఖలో ప్రముఖులు వల్ల తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చూడగలిగానని అన్నారు.
Read Also: Nimmala ramanaidu: టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది..
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. ఆచార్య ప్రసన్న కుమార్ ఆంగ్ల ఉపన్యాసం ఆసక్తికరంగా ఉండేది.. వెంకయ్య నాయుడుకి, ప్రసన్న కుమార్కి పోలిక ఉందని అన్నారు. ఇద్దరు విద్యార్థి సంఘాల నాయకులుగా గెలిచారు.. ప్రసన్న కుమార్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో డాల్ఫీన్ డైరీస్ కథనాలు రాశారన్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. మంచి ఎడ్యుకేషన్ పాలసీ తీసుకువచ్చారు.. ఎడ్యుకేషన్ పాలసీ పై శ్రద్ధ ప్రభుత్వ స్థాయిలలో కనిపించడం లేదని తెలిపారు. ఉప కులపతి అంటే ఒక కులం వారినే వేయాలని అనుకుంటున్నారు.. మేధావులను, విజ్ఞాన ప్రముఖులను విశ్వ విద్యాలయ ఉప కులపతులు ఐతే విశ్వ విద్యాలయాలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Vijayawada: ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..
తాజావార్తలు
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!