CM Revanth: తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా అండగా ఉంటాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో న్యాయ సాధన సభ నిర్వహించారు. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పెత్తందార్లు వచ్చి తెలుగు గడ్డ మీద ఇటుక ముక్క కూడా తీసుకుని వెళ్ళలేరని విమర్శించారు. విశాఖ ఉక్కును ఎవరు టచ్ చేయలేరని అన్నారు. వైఎస్సార్ సంకల్పం నిలబెట్టిన వాళ్ళే వారసులు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళు ఏ విధంగా వారసులు అవుతారో చెప్పాలని పేర్కొన్నారు. మరోవైపు.. రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి రాష్ట్రానికి దాపురించింది.. తెలంగాణ, ఆంధ్రలో ఢిల్లీ వెళ్లి వంగి దండాలు పెట్టే వాళ్ళే కానీ.. ప్రశ్నించే నాయకత్వం లేకుండా పోయిందని మండిపడ్డారు.
Telangana: హస్తం, కమలం పార్టీల మధ్యే పోటీ.. రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
Also Read
- Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వారీగా కలిసి వుండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ బలం బలగం బాబు, జగన్, పవన్ అని పేర్కొన్నారు. ముత్యాల ముగ్గులో రావు గోపాల రావు పక్కన ఉంటే భజనపరులు లాగా ఢిల్లీలో మోదీ పక్కన జగన్, బాబు నిలబడుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రకు కావలిసినది వెన్నెముక లేని నాయకత్వం కాదు నిటారుగా మాట్లాడే వాళ్ళు కావాలన్నారు. జగన్, బాబు, పవన్ కు మోడీని ప్రశ్నించే శక్తి లేదని విమర్శించారు. పాలించే నాయకులు కాదు.. ప్రశ్నించే గొంతులు కావాలని తెలిపారు. 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇవ్వండి విశాఖ ఉక్కును షర్మిళ కాపాడుతుందని పేర్కొన్నారు.
MS Dhoni: అక్కడ భారీ సిక్స్ లతో రెచ్చిపోయిన ధోని..!
తెలంగాణలో ఒక పక్క మోడీ.. మరో పక్క కేడీ మీద మాట్లాడామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మోడీని ఓడించాము.. KDని పడగొట్టామన్నారు. తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు. అచ్చోసిన అంబోతులు తలపడుతుంటే కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం ఎంత కష్టమో షర్మిళకు తెలుసన్నారు. అదానీ కోసం ప్రధాని విశాఖ ఉక్కును తెగ నమ్ముతుంటే ఇక్కడ నాయకత్వం మాట్లాడటం లేదనిన మండిపడ్డారు. బీజేపీ నీడ ఏనాడూ వైఎస్ అర్ మీద పడ లేదు.. అటువంటి మోడీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా వారసులు అవుతారో చెప్పాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం మళ్లీ వస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
-
Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?