CM Revanth: తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా అండగా ఉంటాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో న్యాయ సాధన సభ నిర్వహించారు. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పెత్తందార్లు వచ్చి తెలుగు గడ్డ మీద ఇటుక ముక్క కూడా తీసుకుని వెళ్ళలేరని విమర్శించారు. విశాఖ ఉక్కును ఎవరు టచ్ చేయలేరని అన్నారు. వైఎస్సార్ సంకల్పం నిలబెట్టిన వాళ్ళే వారసులు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళు ఏ విధంగా వారసులు అవుతారో చెప్పాలని పేర్కొన్నారు. మరోవైపు.. రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి రాష్ట్రానికి దాపురించింది.. తెలంగాణ, ఆంధ్రలో ఢిల్లీ వెళ్లి వంగి దండాలు పెట్టే వాళ్ళే కానీ.. ప్రశ్నించే నాయకత్వం లేకుండా పోయిందని మండిపడ్డారు.
Telangana: హస్తం, కమలం పార్టీల మధ్యే పోటీ.. రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వారీగా కలిసి వుండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ బలం బలగం బాబు, జగన్, పవన్ అని పేర్కొన్నారు. ముత్యాల ముగ్గులో రావు గోపాల రావు పక్కన ఉంటే భజనపరులు లాగా ఢిల్లీలో మోదీ పక్కన జగన్, బాబు నిలబడుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రకు కావలిసినది వెన్నెముక లేని నాయకత్వం కాదు నిటారుగా మాట్లాడే వాళ్ళు కావాలన్నారు. జగన్, బాబు, పవన్ కు మోడీని ప్రశ్నించే శక్తి లేదని విమర్శించారు. పాలించే నాయకులు కాదు.. ప్రశ్నించే గొంతులు కావాలని తెలిపారు. 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇవ్వండి విశాఖ ఉక్కును షర్మిళ కాపాడుతుందని పేర్కొన్నారు.
MS Dhoni: అక్కడ భారీ సిక్స్ లతో రెచ్చిపోయిన ధోని..!
తెలంగాణలో ఒక పక్క మోడీ.. మరో పక్క కేడీ మీద మాట్లాడామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మోడీని ఓడించాము.. KDని పడగొట్టామన్నారు. తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు. అచ్చోసిన అంబోతులు తలపడుతుంటే కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం ఎంత కష్టమో షర్మిళకు తెలుసన్నారు. అదానీ కోసం ప్రధాని విశాఖ ఉక్కును తెగ నమ్ముతుంటే ఇక్కడ నాయకత్వం మాట్లాడటం లేదనిన మండిపడ్డారు. బీజేపీ నీడ ఏనాడూ వైఎస్ అర్ మీద పడ లేదు.. అటువంటి మోడీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా వారసులు అవుతారో చెప్పాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం మళ్లీ వస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!