CP Ravi Shankar Ayyanar: వార్షిక క్రైమ్ రివ్యూ.. గతంతో పోలిస్తే 30 శాతం క్రైమ్ రేట్ తగ్గింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిశ యాప్ నేర నివారణలో చాలా కీలకంగా మారిందని విశాఖపట్నం సీపీ రవి శంకర్ అయ్యనార్ అన్నారు. శుక్రవారం ఆయన వార్షిక క్రైం రేట్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే 30 శాతం క్రైం రేట్ తగ్గిందన్నారు. కానీ, సైబర్ క్రైం రేట్ పెరిగిందని చెప్పారు. అయితే దానికి కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే మహిళలపై దాడులు కసులు తగ్గాయని, దిశ ప్రభావంతో మహిళల భద్రత పెరిగిందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సంవత్సరంలో 27 హత్యలు జరిగాయి. అందులో ఎక్కువగా అక్రమ సంబంధాలు, ఆవేశంలో చేసిన హత్యాలే అధికంగా ఉన్నాయి.
Also Read: Lok Sabha Election 2024: ఇండియా కూటమిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
Also Read
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
దిశ యాప్ నేర నివారణలో చాలా కీలకంగా మారింది. 21 లక్షల మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో మహిళా పోలీసులని అభినందిస్తున్నాను. దిశ కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. చాలా కేసులు ఇక్కడే కంప్రమైస్ అవుతున్నాయి. మహిళా పోలీసులు అన్ని అంశాలపై పాఠశాలల్లో అవగాహనా కల్పిస్తున్నారు. గంజాయి రవాణాకు విశాఖను కేంద్రంగా ఎంచుకుంటున్నారు. గంజాయి సాగుని పూర్తిగా ధ్వంసం చేసాం. ఒరిస్సా నుంచే ఎక్కువ గంజాయి విశాఖ వచ్చి వేరే రాష్ట్రలకు వెళుతుంది. ఈ రవాణాను నివారించేందుకు పటిష్టంగా పని చేయబోతున్నాం. గతంతో పోల్చుకుంటే ఇక్కడ గంజాయి వాడకం తగ్గింది. 2022 లో 39 మర్డర్ కేసులు నమోదు కాగా 2023 లో 24 మర్డర్ కేసు లు నమోదు అయ్యాయి.
Also Read: Sonia Gandhi: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనియా!
2022లో 42 కిడ్నాప్ కేసులు నమోదు కాగా..2023 లో 18 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. 2022 లొ 127 అత్యాచారం కేసులు నమోదు కాగా 2023 లో 78 కేసులు నమోదు అయ్యాయి. 2022 లో 65 అటెంపెట్ టు మర్డర్ కేసులు నమోదు కాగా.. 2023 లో 47 అటెంపెట్ టు మర్డర్ కేసులు నమోదు అయ్యాయి. 2022 లో 841 వైట్ కలర్ క్రైమ్ కేసులు నమోదు కాగా. 2023 లో 723 వైట్ కలర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయి. వర కట్నం వేధింపుల వలన మృతి చెందిన కేసులు 2022 లో 6 కాగా 2023 లో 7 కేసులుగా నమోదయ్యాయి. 498-A సెక్షన్ల కింది కేసులో 2022లో 714గా ఉండగా.. 2023లో 479గా నమోదయ్యాయి’ అని సీపీ వివరించారు.
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!