Seven Fishermen Missing: విశాఖ తీరంలో ఉత్కంఠ.. సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
- సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు
- ఆచూకీ పై కొనసాగుతున్న ఉత్కంఠ
- మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం తీరంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారి ఆచూకీ కోసం భారత కోస్ట్ గార్డ్ విస్తృత స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనతో ఫిషింగ్ హార్బర్ వద్ద వేచి చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు సుమారు 50 మైళ్ల దూరంలో ఉన్న పూడిమడక పరిసర ప్రాంతాల్లో వేట కొనసాగించారు. అయితే, నిన్న సాయంత్రం 4.30 గంటల తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదు.
గంగవరం పోర్టు సమీపం నుంచే చివరి సమాచారం
కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన సమయంలో తాము గంగవరం పోర్టు సమీపంలో ఉన్నామని మత్స్యకారులు తెలిపినట్లు సమాచారం. ఆ తర్వాత వారి ఫోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Also Read
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- CM Chandrababu: 'స్వర్ణ కుప్పం విజన్ 2029'కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్పై సీఎం సమీక్ష
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Kandula Durgesh: "మీ అక్రమ సంబంధం నాకు తెలుసు".. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్
మత్స్యకారులతో సంబంధాలు తెగిపోవడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. భారత కోస్ట్ గార్డ్ సముద్రంలో ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించింది. గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నారు.
ఏడాది క్రితం కొనుగోలు చేసిన బోటు
గల్లంతైన బోటును యజమాని కారి చిన్నయ్య ఏడాది క్రితమే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ బోటుకు ఆయనే డ్రైవర్గా వ్యవహరిస్తుండగా, తన అల్లుడు, అన్నయ్య కుమారులతో కలిసి చేపల వేటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురు మత్స్యకారులు ఒకేసారి గల్లంతవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
గల్లంతైన మత్స్యకారులు వీరే
అప్పలరాజు
బండియ్య
గరగయ్య
సీతుడు
చిన్న అమ్మోరు
కారి చిన్న
కారి చిన్నయ్య
ఫిషింగ్ హార్బర్లో విషాద వాతావరణం
మత్స్యకారుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద రోదనలు మిన్నంటిస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలను కొనసాగిస్తోంది. సముద్రంలో గల్లంతైన బోటులో ఒకరు సేఫ్ గా కోస్ట్ గార్డ్ సిబ్బందికి చిక్కారు. బోటు ఓనర్ చిన్నయ్య ను కాపాడారు. తక్కిన మత్స్యకారుల ఆచూకీపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Seven Fishermen Missing: విశాఖ తీరంలో ఉత్కంఠ.. సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
-
TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
-
Hrithik Roshan: హృతిక్ రోషన్ సినిమాకు పరశురామ్ డైరెక్టర్? అసలు నిజం ఇదే!
-
ASUS Vivobook 15 2026: కొత్త ఇంటెల్ ప్రాసెసర్, 15.6-ఇంచెస్ డిస్ప్లేతో ఆసుస్ ల్యాప్టాప్ విడుదల.. ధర ఎంతంటే?
-
PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!