Seven Fishermen Missing: విశాఖ తీరంలో ఉత్కంఠ.. సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
- సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు
- ఆచూకీ పై కొనసాగుతున్న ఉత్కంఠ
- మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం తీరంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారి ఆచూకీ కోసం భారత కోస్ట్ గార్డ్ విస్తృత స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనతో ఫిషింగ్ హార్బర్ వద్ద వేచి చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు సుమారు 50 మైళ్ల దూరంలో ఉన్న పూడిమడక పరిసర ప్రాంతాల్లో వేట కొనసాగించారు. అయితే, నిన్న సాయంత్రం 4.30 గంటల తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదు.
గంగవరం పోర్టు సమీపం నుంచే చివరి సమాచారం
కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన సమయంలో తాము గంగవరం పోర్టు సమీపంలో ఉన్నామని మత్స్యకారులు తెలిపినట్లు సమాచారం. ఆ తర్వాత వారి ఫోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Also Read
- Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
- Chandrababu: జంక్ ఫుడ్ తింటున్నాం.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు నాయుడు
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Collector Prabhakar Reddy: తండ్రిగా మెగా పీటీఎంకు హాజరైన కలెక్టర్..!
రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్
మత్స్యకారులతో సంబంధాలు తెగిపోవడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. భారత కోస్ట్ గార్డ్ సముద్రంలో ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించింది. గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నారు.
ఏడాది క్రితం కొనుగోలు చేసిన బోటు
గల్లంతైన బోటును యజమాని కారి చిన్నయ్య ఏడాది క్రితమే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ బోటుకు ఆయనే డ్రైవర్గా వ్యవహరిస్తుండగా, తన అల్లుడు, అన్నయ్య కుమారులతో కలిసి చేపల వేటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురు మత్స్యకారులు ఒకేసారి గల్లంతవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
గల్లంతైన మత్స్యకారులు వీరే
అప్పలరాజు
బండియ్య
గరగయ్య
సీతుడు
చిన్న అమ్మోరు
కారి చిన్న
కారి చిన్నయ్య
ఫిషింగ్ హార్బర్లో విషాద వాతావరణం
మత్స్యకారుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద రోదనలు మిన్నంటిస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలను కొనసాగిస్తోంది. సముద్రంలో గల్లంతైన బోటులో ఒకరు సేఫ్ గా కోస్ట్ గార్డ్ సిబ్బందికి చిక్కారు. బోటు ఓనర్ చిన్నయ్య ను కాపాడారు. తక్కిన మత్స్యకారుల ఆచూకీపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
-
Story Board : జెన్ జి ఉద్యమాలు.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న యువత..
-
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
-
Shreyas Iyer: ఆ ఇద్దరు అద్భుతం చేశారు.. గుడ్న్యూస్తో పాటు బ్యాడ్న్యూస్ కూడా చెప్పిన శ్రేయస్ అయ్యర్..
-
Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!