Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. మరొకరి మృతి..!
- 80% కాలిన గాయాలతో సూరిబాబు మృతి
- ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10కు చేరిక
- నలుగురు కార్మికులకు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగింపు
- బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కార్మిక సంఘాల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakha Steel Plant: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (స్టీల్ ప్లాంట్)లో జరిగిన భారీ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న మరో కార్మికుడు కన్నుమూశారు. ప్రమాద తీవ్రతకు గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న సూరిబాబు అనే కార్మికుడు పరిస్థితి విషమించడంతో మరణించారు. దీంతో ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 10కి చేరుకుంది.
80 శాతం గాయాలతో కన్నుమూత
ప్రమాదం జరిగిన సమయంలో ఉక్కు కరుగుతున్న వేడి ద్రవం (మోల్టెన్ స్టీల్) సూరిబాబు శరీరంపై పడటంతో ఆయనకు దాదాపు 80 శాతానికి పైగా తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. సూరిబాబు పెదగంటాడ మండలం, సీతానగరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయన మరణవార్త తెలియడంతో సీతానగరం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆసుపత్రుల్లో నలుగురికి చికిత్స
ఈ ప్రమాదంలో గాయపడిన మిగిలిన నలుగురు కార్మికులు ప్రస్తుతం నగరంలోని వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో ముగ్గురు శీలానగర్లోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం సమీక్షిస్తోంది.
స్టీల్ ప్లాంట్ హిస్టరీలోనే అత్యంత దారుణమైన ఈ పారిశ్రామిక ప్రమాదం కార్మిక లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. యాజమాన్యం , ప్రభుత్వం బాధితులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!