Kanaka Durga Temple: బెజవాడ దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం.. వీఐపీ, వీవీఐపీలు టికెట్స్ కొనాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై VIP, VVIPలు సైతం దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందే అని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో సుమారు 30 వేల మంది, శుక్రవారం, శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 50 వేల వరకు చేరుతోంది. అయితే, రోజుకు 200–300 మంది వరకు సిఫార్సు లెటర్లతో వచ్చే VIPలు, VVIPలు టికెట్ కొనకుండా దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ ఈవో శీనా నాయక్ దృష్టికి వెళ్లింది.. ఇదే కాకుండా, కొంతమంది ప్రోటోకాల్ పేరుతో టికెట్ లేకుండానే దర్శనాలు చేస్తున్నారని, దీని వల్ల ఆలయ ఆదాయానికి భారీ గండి పడుతోందని అధికారులు గుర్తించారు. దీంతో ఈ పద్ధతికి అడ్డుకట్ట వేయాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు.
Read Also: CM Revanth Reddy: ఈ మనుషుల విషం.. మూసీలో మురికి కంటే ఎక్కువ..
Also Read
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
ఈ ప్రతిపాదనపై ఆలయ ఈవో శీనా నాయక్, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ధర్మకర్త మండలి సభ్యులు, ఇతర ఆలయ అధికారులతో కలిసి విస్తృత సమీక్ష నిర్వహించారు. సిఫార్సు లెటర్లతో వచ్చే ప్రతి ఒక్కరూ టికెట్ కొనాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ నిబంధనను ముందుగా ధర్మకర్తల మండలి సభ్యుల నుంచే అమలు చేయాలి అని చైర్మన్ రాధాకృష్ణ సూచించారు. ఈ నిర్ణయానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కూడా ఎడీసీఎల్ (ADCL) ఛైర్పర్సన్ & MDకు ఆదేశాలు జారీ చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు టికెట్ కొనకుండా వెళ్లడం వల్ల హుండీ, దర్శన టికెట్ ఆదాయం తగ్గిపోతోందని ఆలయ అధికారులు తెలిపారు. కొత్త నిబంధనతో అమ్మవారి సేవా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని, ఆలయ అభివృద్ధికి నిధుల లభ్యత పెరుగుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!